కొడాలి నానికి చంద్రబాబు హెచ్చరిక!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన దాడుల పైన దృష్టి సారించారు. ఏపీ సర్కార్ వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల టిడిపి పార్టీ కార్యాలయాల పైన జరిగిన దాడులు, తెలుగుదేశం పార్టీ నేతలపైన జరిగిన దాడి కేసులను వెలికి తీసే పనిలో పడింది.

టార్గెట్ గుడివాడ కొడాలి నాని
ఇప్పటికే వల్లభనేని వంశీ పైన కేసు నమోదు చేసి వంశీని పట్టుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్న పోలీసులు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడలో చేసిన దాడుల పైన కూడా చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు సర్కార్ రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

chandrababu warning to kodali nani police ready to arrest kodali nani followers in tdp leaders attack case

క్యాసినో వ్యవహారంలో గుడివాడలో టీడీపీ నేతలపై దాడులు
గుడివాడలో క్యాసినో వ్యవహారం పైన తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీపై జరిగిన దాడుల పైన ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించినట్టు సమాచారం. కొడాలి నాని క్యాసినో వ్యవహారం పైన జనవరి 21 2022న గుడివాడ వచ్చిన నిజనిర్ధారణ కమిటీ నేతలపైన వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. గుడివాడ టిడిపి కార్యాలయం పైన దాడి చేయడంతో పాటు ఫర్నిచర్ ధ్వంసం చేశారు.

క్యాసినో రగడ.. టీడీపీ నేతలపై దాడులు చేసిన వారిపై కేసులు
అయితే అప్పుడు పోలీసులు ఈ ఘటనల పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా టిడిపి నేతలపైనే కేసులను నమోదు చేశారని అప్పట్లో టిడిపి నేతలు వాపోయారు. అయితే ఈ ఘటనల పైన ఇప్పుడు దృష్టి సారిస్తున్న ఏపీ పోలీసులు వైసీపీ సీనియర్ నేత దుక్కిపాటి భూషణ్, కొడాలి నాని అనుచరుల పైన కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.

వైసిపి నేతలను జైలుకు పంపించే ప్లాన్ లో చంద్రబాబు
అవసరమైతే ఈ కేసుల్లో వైసిపి నేతలను జైలుకు పంపించేందుకు కూడా చంద్రబాబు సర్కార్ రెడీ అంటుంది. ఇక ఇది మాత్రమే కాదు డిసెంబర్ 25 2022న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్న రావి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నేతలపైన వైసీపీ పార్టీ నేతలు దాడులు చేసినటువంటి ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించారు.

రావితో పాటు టీడీపీ నేతలపై దాడి చేసిన వారిపై కేసులు
కత్తులు, కర్రలు, ఇనప రాడ్లు, పెట్రోల్ ప్యాకెట్లతో వైసిపి కార్యకర్తలు తెలుగుదేశంపార్టీ నేతలపైన దాడి చెయ్యగా అప్పట్లో సిఐ గోవిందరాజులు టిడిపి నేతలు పైనే తప్పుడు కేసులు నమోదు చేసి, వైసిపి నేతలకు వత్తాసు పలికారు. ఇక అప్పటి వీడియోఫుటేజ్ ఆధారంగా మెరుగుమాల కాళీ, నీరుడు ప్రసాద్ తో పాటు మరో 20మందిపై 143,144, 146,188,427, 506 r/w 149 BNS క్రింద కేసులు నమోదు చేశారు .

వారికి చంద్రబాబు హెచ్చరిక
ఇక కొడాలి నాని టార్గెట్ గా ఆయన అనుచరులను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో కొడాలి నానికి కూడా త్వరలో చుక్కలు చూపిస్తారు అన్నది ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న చర్చ. వైసిపి ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ నేతలను తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసిన ఏ ఒక్కరిని వదిలేది లేదని తాజా పరిణామాలతో చంద్రబాబు చెప్పకనే చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+