పోలవరంపై కేంద్రం గుడ్ న్యూస్-స్వాగతించిన చంద్రబాబు-కీలక వ్యాఖ్యలు..!
2026-27 మార్చి నెల లోపు పోలవరం పూర్తి చేసేలా కేంద్ర కేబినెట్ షెడ్యూల్ ప్రకటించడాన్ని సీఎం చంద్రబాబు స్వాగతించారు. తొలి డీపీఆర్ ప్రకారం మొత్తం 25,760 కోట్లలో ఇప్పటివరకు విడుదల చేసింది రూ.15,146 కోట్లని చంద్రబాబు తెలిపారు. భూసేకరణ, పునరావాస ప్యాకేజీకి రూ.1,597 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. మిగిలిన 12,157 కోట్లు ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ అనుమతించిందని చంద్రబాబు తెలిపారు. 2024-25 కు 6వేల కోట్లు, 2025-26 కు 6,157 కోట్లు ఇచ్చేలా కేంద్రం షెడ్యూల్ ఇవ్వడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.

కేంద్రం నిర్ణయం నిరాశా నిస్పృహల్లో ఉన్న రాష్ట్రానికి భరోసా నిచ్చేలా కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు సాయంతో పాటు రెండు పారిశ్రామిక కారిడార్లను ప్రకటించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిపై ప్రదాని మోడీతో పాటు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు జలవనరులశాఖ డైరెక్టర్ సీఆర్ పాటిల్ కు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు మాజీ సీఎం అంజయ్య ఎప్పుడో పునాది వేశారని చంద్రబాబు గుర్తుచేశారు. కాటన్ హయాంలోనే ఈ ప్రాజెక్టు చేపట్టాల్సి ఉన్నా అప్పట్లో బ్రిటన్ పార్లమెంట్ ఒప్పుకోకపోవడం వల్ల ముందుకు సాగలేదన్నారు.
మాజీ సీఎం వైఎస్ హయాంలో కాంట్రాక్టర్లను మార్చి 2009 వరకూ వారిని పనిచేయకుండా అడ్డుపడ్డారని చంద్రబాబు ఆరోపించారు. అప్పట్లో కాలువల్లో మట్టి మాత్రమే చేశారన్నారు. మధ్యలో రోశయ్య కూడా ఏమీ చేయలేదని, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాక టెండర్లు పిలిచారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా దీన్ని గుర్తించిందన్నారు. ఏడు మండలాల కోసం తాను పోరాటం చేసి సాధించానన్నారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టును పరుగులు తీయించామన్నారు.
ఆ తర్వాత వచ్చిన జగన్.. రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్ ను మార్చి ప్రాజెక్టును అనాథగా మార్చారన్నారు. రెండేళ్ల పాటు ప్రాజెక్టును అస్సలు పట్టించుకోకుండా వదిలేశారన్నారు. 2021 నాటికి ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉండగా.. వైసీపీ ప్రభుత్వ చర్యలతో కాఫర్ డ్యామ్ డిస్ట్రబ్ చేసి గ్యాప్ 1 కొట్టుకుపోయేలా చేశారన్నారు. దీంతో చరిత్రలో ఎప్పుడూ రానంత నష్టం జరిగిందన్నారు. దీంతో వైసీపీ సర్కార్ కట్టిన గైడ్ బండ్ కూడా కుంగిపోయిందన్నారు. కేంద్రం 8 వేల కోట్లిస్తే 4 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగతా డబ్బులు మళ్లించుకున్నారని ఆరోపించారు. పోలవరం అథారిటీ కాంట్రాక్టర్ మార్చవద్దని చెప్పినా వినిపించుకోలేదన్నారు. దీని ఫలితాల్ని ఇప్పటికీ అనుభవిస్తున్నట్లు తెలిపారు.
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం











Click it and Unblock the Notifications