పదేళ్లకు నవ్విన బాబు! జగన్ బేజారు, కారు జోరు
న్యూఢిల్లీ: సీమాంధ్రలో తెలుగుదేశం, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు దూసుకెళ్తున్నాయి. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ టిడిపికి పోటీ ఇచ్చినప్పటికీ సైకిల్ హవా కనిపిస్తోంది. పదేళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన మెజార్టీ కనిపిస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. సీమాంధ్రలోని పార్టీ కార్యాలయాల్లో, హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 63, టిడిపి 105, బిజెపి 4 స్థానాల్లో ముందంజలో ఉంది. లోకసభ స్థానాల విషయానికి వస్తే టిడిపి 13, బిజెపి 3, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 9 స్థానాల్లో ముందంజలో ఉంది.
తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర సమితికి స్పష్టమైన ఆధిక్యం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తెరాస 66, కాంగ్రెసు 22, టిడిపి, బిజెపి కూటమి 22, మజ్లిస్ 6 స్థానాల్లో ముందంజలో ఉంది. లోకసభ విషయానికి వస్తే తెరాస 11, కాంగ్రెస్ 2, బిజెపి, టిడిపి కూటమి 2, మజ్లిస్ 1, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 1 స్థానంలో ముందంజలో ఉంది.
-
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!!












Click it and Unblock the Notifications