రోజా భర్త సెల్వమణి పై అరెస్ట్ వారెంట్ - చెన్నై కోర్టు ఉత్తర్వులు..!!
ప్రముఖ దర్శకుడు.. వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్త ఆర్కే సెల్వమణి పైన అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పరువు నష్టం కేసులో విచారణకు హాజరు కాకపోవటంతో చెన్నై జార్జి టౌన్ కోర్టు వారెంట్ ఇచ్చింది. సెల్వమణి దక్షిణ భారత చలన చిత్ర కార్మిక సంఘాల సమ్మేళనం అధ్యక్షుడిగానూ ఉన్నారు. 2016లో సెల్వమణి..కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అన్బరసు ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూలో ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోద్రా గురించి తమ అభిప్రాయాలను స్పష్టం చేసారు.
దీంతో..బోద్రా జార్జి టౌన్ కోర్టులో సెల్వమణితో పాటుగా అరుళ్ అన్భరసు పైన పరువు నష్టం దావా వేశారు. బోద్రా మరణించాక.. ఆయన కుమారుడు గగన్ బోద్రా ఈ కేసు కొనసాగిస్తున్నారు. ఈ కేసు కోర్టులో మంగళవారం విచారణకు వచ్చింది. కాగా, సెల్వమణితో పాటుగా అరుళ్ అన్భరసు కోర్టు ముందు హాజరు కాలేదు. వారి తరపున న్యాయవాదులు సైతం రాలేదు. దీంతో..న్యాయమూర్తి వారిద్దరి పైనా అరెస్ట్ వారెంట్ జారీ చేసారు.

కేసు తదుపరి విచారణ ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసారు. 2016 సెప్టెంబర్ 5న టీవీ ఛానల్ చర్చలో వారిరువురు వ్యాఖ్యలు చేయగా..2017 లో కేసు దాఖలైంది. వారిద్దరూ చేసిన వ్యాఖ్యలతో సాధారణ ప్రజల్లో తన పరవుకు భంగం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని పిటీషనర్ పేర్కొన్నారు. దీంతో.. కోర్టు తాజా వారెంట్ తో సెల్వమణి.. అన్భరసు ఇప్పుడు ఈ వారెంట్ రీకాల్ కోసం ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications