పవన్ కళ్యాణ్ నివాళులు, కంటతడిపెట్టిన చిరు, సీటు బెల్టుపై..
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జానకిరాం మృతదేహానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిరంజీవిలు నివాళులు అర్పించారు. మాసాబ్ ట్యాంక్లోని హరికృష్ణ నివాసానికి వచ్చిన చిరు, పవన్ నివాళులు అర్పించిన అనంతరం హరికృష్ణ కుటుంబాన్ని ఓదార్చారు.
జానకిరాం భౌతికకాయాన్ని చూసి చిరంజీవి చలించిపోయారు, కంటతడిపెట్టారు. హరికృష్ణను ఓదార్చిన తర్వాత బయటకు వచ్చిన చిరు విలేకరులతో మాట్లాడారు. ఆ సమయంలో దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. జానకిరాం మృతి దురదృష్టకరమన్నారు. ఈ సమయంలో ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. గొంతు బొంగురుపోయింది.

అందరు కూడా ప్రయాణం సమయంలో సీటు బెల్టు ప్రాధాన్యతను చెప్పారు. అందరు కూడా తప్పకుండా సీటు బెల్టు పెట్టుకోవాలన్నారు. విధిని ఎవరు తప్పించుకోలేరన్నారు. కాగా, జానకిరాంకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ పలువురు ప్రముఖులు హరికృష్ణ నివాసానికి చేరుకుని జానకిరాం భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
నందమూరి హరికృష్ణను సోదరుడు బాలకృష్ణ ఓదార్చారు. సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్, దర్శకుడు రాఘవేంద్ర, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీప్రణీత, లక్ష్మీపార్వతి, పరుచూరి వెంకటేశ్వరరావు, జగపతి బాబు, జీవిత, వందేమాతరం శ్రీనివాస్ తదితరులు జానకిరాంకు పూలమాల వేసి నివాళులర్పించారు.
మధ్యాహ్నం 2 గంటలకు జానకిరామ్ అంతిమయాత్ర ప్రారంభంకానుంది. సాయంత్రం 4 గంటలకు మొయినాబాద్ ఫాంహౌస్లో జానకిరామ్ అంత్యక్రియలు జరుగనున్నాయి. శనివారం హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తున్న జానకిరామ్ వాహనం నల్లగొండ జిల్లా మునాగాల మండలం ఆకుపాముల సమీపంలో ప్రమాదానికి గురైంది. జానకిరాంస్వయంగా నడిపిస్తున్న వాహనాన్ని రాంగ్రూట్లో వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడ్డ అతను మృతి చెందారు.
-
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ : భగ్గుమన్న ఏపీ నెటిజెన్లు -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్బాబు మాటల యుద్ధం -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications