పరిటాల: బాబుపై చిరంజీవి, కాంగ్రెస్లోకి టిడిపి ఎమ్మెల్యే
అనంతపురం/న్యూఢిల్లీ: దివంగత పరిటాల రవీంద్ర హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిని తెలుగుదేశం పార్టీలో ఎలా చేర్చుకుంటారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార సారథి చిరంజీవి ప్రశ్నించారు. గురువారం సీమాంధ్ర కాంగ్రెసు నేతల బస్సుయాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు.
కాంగ్రెసు పార్టీని కొందరు నేతలు మోసం చేశారన్నారు. చంద్రబాబు బిజెపితో పొత్తుకు సిద్ధమవుతున్నారని, ఆయనను నమ్మి మైనార్టీలు మోసపోవద్దన్నారు. విభజన విషయంలో కేవలం కాంగ్రెసు పార్టీని మాత్రమే తప్పు పట్టడం సరికాదన్నారు. టిడిపి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిందని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆర్టికల్ 3 ప్రకారం విభజన చేయాలని చెప్పిందని, తాము అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని బిజెపి చెప్పిందని.. ఇలా అన్ని పార్టీలు చెప్పాకే కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు.

విభజన విషయంలో కాంగ్రెసును తప్పుపట్ట వద్దన్నారు. కాంగ్రెసు పార్టీ నాయకులను చంద్రబాబు తమ పార్టీలో ఎలా చేర్చుకుంటున్నారన్నారు. అప్పుడు అవినీతిపరులుగా కనిపించిన నేతలు.. ఇప్పుడు తమ పార్టీలో చేరగానే నిజాయితీపరులు అవుతారా అన్నారు.
కాంగ్రెసులోకి సుద్దాల దేవయ్య
కరీంనగర్ జిల్లా చొప్పదండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య కాంగ్రెస్లో చేరారు. ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్, తెలంగాణ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
-
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications