రామోజీ సంస్మరణ సభకు చిరంజీవి దూరం..ప్రజారాజ్యం జ్ఞాపకాలు చెరగలేదా..?
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఇటీవలే అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సంస్మరణ సభను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సంస్మరణ సభకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక సినీ ప్రముఖులు సైతం సంస్మరణ సభకు విచ్చేసి రామోజీరావు గొప్పతానాన్ని గుర్తు చేసుకున్నారు.
రాజమౌళి, కీరవాణి,రాఘవేంద్రరావు, అశ్వినీదత్, సురేష్ బాబు వంటి సినీ ప్రముఖులు రామోజీరావు సంస్మరణ సభ హాజరయ్యారు. అయితే ఈ సంస్మరణ సభకు ఇండస్ట్రీ పెద్దగా భావించే మెగాస్టార్ చిరంజీవి దూరంగా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు రామోజీరావు సంస్మరణ సభకు చిరంజీవికి ఆహ్వానం అందిందా లేదా అనేది తెలియడం లేదు. ఒకవేళ ఆహ్వానం అందితే ఆయన ఎందుకు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

అయితే గతంలో చిరంజీవికి వ్యతిరేకంగా రామోజీరావు తన ఈనాడు పత్రికలో అనేక కథనాలు ప్రచురించడం జరిగింది. చిరంజీవి ప్రజారాజ్యం రాజకీయ పార్టీని స్థాపించిన దగ్గర నుంచి కూడా ఆ పార్టీకి వ్యతిరేకంగా కక్ష్యపూరిత కథనాలు ఈనాడులో ప్రసారం చేశారు. ముఖ్యంగా 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం దారుణంగా ఓడిపోయింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ వల్లే ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందనే భావన ఆ పార్టీ నాయకుల్లో కనిపించింది. ఈ విషయాన్ని చంద్రబాబు సైతం బహిరంగంగానే చెప్పడం జరిగింది.
ఆ తర్వాత కొద్దికాలానికే ఈనాడు దిన పత్రికలో ప్రజారాజ్యం దుకాణం బంద్ అంటూ పెద్ద శీర్షికను ప్రచురించారు. దీంతో ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రజారాజ్యంపై చర్చ నడిచింది. దీనిపై చిరంజీవి రామోజీరావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవే స్వయంగా ఈనాడు ఆఫీస్ ముందు ధర్నాకు దిగి నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో చిరంజీవి ఈనాడుపై సంచలన ఆరోపణలు చేశారు. రామోజీరావు కేవలం టీడీపీ మాత్రమే అధికారంలోకి రావాలని అనుకుంటారు.

మా జెండాను పీకేయడానికి రామోజీరావు ఎవరని చిరంజీవి ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి రాకపోతే ఈనాడు సంస్థల అధినేత తట్టుకోలేరని , ఎన్టీఆర్ను కూడా టీడీపీ నుంచి దూరం చేయడంలో ఆయనదే ప్రముఖ పాత్రం అంటూ చిరంజీవి రామోజీరావును విమర్శించారు. ఇక ఈనాడులో కథనాలు వచ్చిన తర్వాతే ప్రజారాజ్యం నిర్వీర్యం అవుతూ వచ్చింది. ఆ తర్వాత చిరంజీవి పార్టీని ముందుకు తీసుకువెళ్లలేక ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంపై అప్పట్లో పవన్ కల్యాణ్ సైతం తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజారాజ్యం నిర్వీర్యం అవ్వడం వెనుక కొన్ని దుష్టశక్తులు పని చేశాయని అప్పట్లో పవన్ కల్యాణ్ బహిరంగంగానే విమర్శలు చేశారు. ప్రజారాజ్యం నిర్వీర్యం కావడంలో రామోజీరావు పాత్ర కూడా ఉందనే కారణంగానే చిరంజీవి ఆయన సంస్మరణ సభ దూరంగా ఉన్నారనే వాదన తెర మీదకు వస్తోంది.

ఇక ఇటీవల సినిమా టికెట్ల రేట్ల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కలిసిన వారంతా రామోజీరావు సంస్మరణ సభకు హాజరయ్యారు. కానీ అల్లు అరవింద్ మాత్రం ఈ సంస్మరణ సభకు హాజరు కాలేదు. సినిమా టికెట్ల రేట్ల విషయంలో అన్ని ముందుండి నడిపిన అల్లు అరవింద్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రజారాజ్యం పాత జ్ఞాపకాలు ఇంకా మదిలో ఉండటం వల్లే చిరంజీవి, అల్లు అరవింద్ రామోజీరావు సంస్మరణ సభకు హాజరు కాలేదని తెలుస్తోంది.
-
గిరిజనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాలు! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications