హై అలర్ట్, రంగంలోకి కేంద్ర బలగాలు, హాయ్ హాయ్ నాయకా అంటే పగిలిపోతుంది, సైలెంట్ !
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైయ్యింది. సమస్యాత్మిక ప్రాంతాల్లోకి కేంద్ర బలగాలను రంగంలోకి దింపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలు, మండల కేంద్రాల పరిధిలోని సమస్యాత్మక నియోజక వర్గాలు, ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమీషన్ గుర్తించింది. అలాంటి ప్రాంతాల్లో పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను రంగంలోకి దింపామని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి షన్మోహన్ అన్నారు. శనివారం సాయంత్రం ఆరు గంటల లోపు ఎన్నికల ప్రచారం, ర్యాలీలు పూర్తి చేసుకోవాని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు జిల్లా కలెక్టర్ షన్మోహన్ మనవి చేశారు. శనివారం సాయంత్రం ఆరు గంటల తరువాత ఎన్నికల ప్రచారం చేసినా, ర్యాలీలు నిర్వహించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ షన్మోహన్ హెచ్చరించారు.

శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుంది. చివరి రెండు రోజులు చాలా తక్కువ మందితో ఇంటింటి ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఉంటుందని జిల్లా కలెక్టర్ చెప్పారు పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఎవ్వరు కూడా ఎన్నికల ప్రచారం చెయ్యకూడదని, అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ షన్మోహన్ అన్ని పార్టీల నాయకులను హెచ్చరించారు.
ఓటు లేని వారు జిల్లా నుంచి వదిలివెళ్లిపోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ సూచించారు.. పోలింగ్ కు ముందు 76 గంటల పాటు ప్రత్యేక చెక్ పోస్టుల దగ్గర ప్రతి వాహనం తనిఖీలు చేస్తామని, పోలీసులు, ఎన్నికల సిబ్బందికి ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ మణికంఠ మనవి చేశారు. ఓటు హక్కు లేకుండా జిల్లాలో ఎన్నికల ప్రచారం చెయ్యడానికి వచ్చిన వాళ్లు వెంటనే జిల్లా సరిహద్దులు దాటి వెళ్లిపోవాలని ఎస్పీ మణికంఠ సూచించారు.
చిత్తూరు జిల్లాలోని అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు దింపుతున్నామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ షన్మోహన్, జిల్లా ఎస్పీ మణికంఠ హెచ్చరించారు. మే 13వ తేదీ పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఏ పార్టీ జెండాలు, కండువాలు వేసుకుని ఎవ్వరూ తిరగకూడదని కలెక్టర్ సూచించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుంగనూరు, చిత్తూరు. చంద్రగిరి, తిరుపతి, పీలేరు, తంబళపల్లె సమస్యాత్మక అసెంబ్లీ నియోజక వర్గాలు అని ఇప్పటికే ఎన్నికల అధికారులు గుర్తించారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications