పార్లమెంట్ కు వీరపాండ్య కట్ట బొమ్మన్.. కేంద్రంపై వింత నిరసన
ఢిల్లీ : చిత్ర విచిత్ర వేషాలతో ఆందోళనలకు దిగుతుంటారు చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్. కేంద్రం తీరుపై నిరసన గళం వినిపిస్తుంటారు. ఆక్రమంలో బుధవారం మరో కొత్త అవతారమెత్తారు. వీరపాండ్య కట్ట బొమ్మన్ వేషాధారణతో పార్లమెంట్ కు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనలో భాగంగా శివప్రసాద్ ఈ అవతారమెత్తారు.
ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజీ అంటూ గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మోడీ అపజయం ఖాయమని వ్యాఖ్యానించారు. పాటలు పాడుతూ, ఛలోక్తులు విసురుతూ కొత్త గెటప్ లో తనదైన శైలితో మోడీని టార్గెట్ చేశారు శివప్రసాద్.

"రాజధానికి నిధులివ్వమంటే నీళ్లు మొహాన కొట్టావు".. "వైజాగ్ రైల్వే జోన్ ఎవడబ్బ సొత్తు, కడప ఉక్కు ఫ్యాక్టరీ ప్రకటించకపోవడం నీ అహంకారానికి గుర్తు" అంటూ సెటైర్ల మీద సెటైర్లు వేశారు.
ఆయా సందర్భాలను బట్టి చిత్తూరు ఎంపీ శివప్రసాద్ విచిత్ర వేషాధారణతో నిరసనలు తెలుపుతుంటారు. మంగళవారం నాడు పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు చేపట్టిన ఆందోళనలో జానపద సుప్రసిద్ధుడు వంగపండు అవతారమెత్తారు. గతంలో ఎన్టీఆర్, కృష్ణుడు, కాటికాపరి లాంటి చాలా వేషాలతో దర్శనమిచ్చారు.
-
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications