రెండు గ్రామాల మధ్య చిచ్చురేపిన వాలీబాల్ ఆట: తీవ్ర ఘర్షణ, పలువురికి గాయాలు

చిత్తూరు: జిల్లాలోని రెండు గ్రామాల మధ్య వాలీబాల్ ఆట చిచ్చురేపింది. వాలీబాల్ ఆట కారణంగా రెండు గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఘర్షణకు దిగారు. రాళ్లు రువ్వుకోవడం, కర్రలతో కొట్టుకోవడంతో ఇరుపక్షాలకు చెందిన ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్ పురం మండలంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఎస్ఆర్ పురం మండలంలోని పొదలపల్లి, వెంకటాపురం గ్రామాల మధ్య వాలీబాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పొదలపల్లి గ్రామస్తులపై వెంకటాపురం గ్రామస్తులు ఆరుసార్లు గెలిచారు. ఈ క్రమంలో ఇరు గ్రామాలకు చెందిన యువకుల మధ్య వివాదం నెలకొంది.

 chittoor: volleyball game dispute between two village people, fight, few injured

ఈ వివాదం రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారితీసింది. రాళ్లు, సోడా బాటిళ్లతో పరస్పరం దాడులకు దిగారు. ఈ దాడుల్లో ఏడుగురు గాయాలపాలయ్యారు.
ఘర్షణపై సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరుపక్షాలను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘర్షణపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+