నారా లోకేష్ ఎంట్రీ.. అమరావతిలో బాలయ్య రచ్చ!
నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న సరికొత్త చిత్రం ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం #NBK112' అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ ఇప్పటికే మాస్ ఆడియన్స్లో భారీ అంచనాలను రేకెత్తించింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను టాలీవుడ్ ప్రముఖ అగ్ర నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా ఎస్ఎల్వి సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్టు అధికారిక ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 25వ తేదీన అమరావతి సమీపంలోని వెంకటాయపాలెంలో ఉన్న ప్రసిదధ టీటీడీ దేవాలయంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. సినిమా లాంచ్కు సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో నందమూరి అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది.

అయితే ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ అతిథులుగా హాజరుకానుండటం విశేషం. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్య ఘట్టానికి హాజరవుతుండటంతో ఈ ఈవెంట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ లాంచ్ వేడుక కన్నులపండువగా జరగనుంది.
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తన 111వ చిత్రం షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేసిన వెంటనే, కొరటాల శివ మార్క్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం బాలయ్య సరికొత్త మేకోవర్తో సిద్ధం కానున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కథానాయిక, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.












Click it and Unblock the Notifications