సీఐడీ ప్రశ్నల వర్షం: ఉక్కిరి బిక్కిరి అవుతోన్న No. 1 న్యూస్ ఛానల్ యజమాని
అమరావతి: గతేడాది జనవరిలో తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరిగిన కాపు ఐక్య గర్జన సభ అనంతరం చోటు చేసుకున్న విధ్వంసంపై నెంబర్ వన్ న్యూస్ ఛానల్ యజమాని సుధాకర్ నాయుడికి సీఐడీ విచారణ బృందం ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.
తుని విధ్వంసం ఘటనలో విచారణకు రావాలంటూ సీఐడీ పంపిన నోటీసులను అందుకున్న ఆయన ఈ ఉదయం రాజమహేంద్రవరంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రాగా, తుని రైలు దహనం వెనుక ఆయన పాత్రపై సీఐడీ వద్ద ఉన్న సాక్ష్యాలను చూపిస్తూ ఆయన్ను విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని మళ్లీ విచారించేందుకు ఈ నెల 19వ తేదీన గుంటూరులో విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. భూమనతో పాటు కాకినాడలో ఉంటున్న ఆయన సన్నిహితుడు మెహర్కు కూడా సీఐడీ నోటీసులు జారీ చేసింది.
వీరితో పాటు గతంలో విచారణకు హాజరుకాని నెంబర్ వన్ న్యూస్ ఛానల్ అధినేత సుధాకర్ నాయుడికి కూడా మరోసారి సీఐడీ నోటీసులు జారీ చేయగా, ఆయన ఈరోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 6,7 తేదీల్లో భూమనను సీఐడీ అధికారులు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications