కేంద్రంతో వ్యవహారాలు,రాజధాని అభివృద్ది అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం రాష్ట్రానికి సంబంధించి రెండు అతి కీలకమైన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రధాని మోడీతో త్వరలో సమావేశం జరిగే అవకాశమున్న నేపథ్యంలో కేంద్రంతో రాష్ట్రానికి ముడిపడి ఉన్న అంశాలపై సిఎం తొలుత సమీక్ష చేశారు.
రాష్ట్ర విభజన అంశాలు, ప్రాజెక్టుల పురోగతి, కేంద్ర సాయంపై బుధవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఛాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీలో నీతిఆయోగ్ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు. అనంతరం రాజధాని అభివృద్దికి సంబంధించి సిఎం చంద్రబాబు సీఆర్డీఏపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
సిఆర్డిఏ రివ్యూ మీటింగ్ లో మహీంద్రా, షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ, డీఎల్ఎఫ్, జీవీకే తదితర సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణంపై సంక్షిప్త వీడియో చిత్రాన్ని ఈ సమావేశంలో సీఆర్డీఏ ప్రదర్శించింది. అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ సంతోష నగరంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నీయుడు పునరుద్ఘాటించారు.