ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి.. పరవశించిన చంద్రబాబు
విజయవాడలో చేనేత దినోత్సవాన్ని ముగించుకుని ఉండవల్లి వెళ్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు ఆసక్తికర సన్నివేశం కనిపించింది. వెంటనే ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి కిందకు దిగిన చంద్రబాబు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను తిలకించారు. అంతేగాక, వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజీ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి మాట్లాడారు. చంద్రబాబుతో పలువురు సందర్శకులు సెల్ఫీలు దిగారు.
కృష్ణమ్మకు జలకళ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రిచంద్రబాబు ఈ సందర్బంగా తెలిపారు. నీటి ప్రవాహాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉందంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే స్వయంగా ముఖ్యమంత్రి తమ దగ్గరకు వచ్చి మాట్లాడడంతో సందర్శకులు ఆశ్చర్యానికి గురయ్యారు. చాలా సంతోషంగా ఉందన్నారు.

భువనేశ్వరికి 2 చీరలు కొన్న చంద్రబాబు
అంతకుముందే విజయవాడలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్టాళ్లలో ఉత్పత్తులు పరిశీలించి చేనేత కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన సతీమణి భువనేశ్వరికి రెండు చీరలు కొనుగోలు చేశారు చంద్రబాబు. చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చేనేతకారులకు ఇచ్చిన అన్ని పథకాలనూ గత వైఎస్సార్సీపీ సర్కారు రద్దు చేసిందని మండిపడ్డారు. నెలలో ఒకరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు.
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు న్యాయం చేస్తాం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, స్పీకర్ పదవులను బీసీలకే ఇచ్చాం. మంత్రివర్గంలోనూ అగ్రస్థానం కల్పించిన పార్టీ మాది. బీసీలు ఆది నుంచీ పార్టీకి అండగా ఉన్నారు. స్థానిక సంస్థల్లో మళ్లీ రిజర్వేషన్లు తెస్తాం. అలాగే చేనేత రంగంలో సమగ్ర విధానం తీసుకొస్తాం. చేనేతకారుల్లో నైపుణ్యం పెంచి ఆధునిక శిక్షణ ఇప్పిస్తాం. వారికి ఆరోగ్యబీమా కల్పిస్తాం. చేనేత కార్మికులకు జీఎస్టీ తొలగించేందుకు ప్రయత్నిస్తాం. జీఎస్టీ తొలగించకుంటే రియంబర్స్ చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. కార్మికుల ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు.
విజయవాడలో చేనేత దినోత్సవాన్ని ముగించుకుని ఉండవల్లి వెళ్తూ ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి కిందకు దిగిన సీఎం. బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లును ఆసక్తిగా తిలకించన సీఎం. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజీ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి మాట్లాడిన చంద్రబాబు గారు. నీటి… pic.twitter.com/PIex4jr3zg
— Telugu Desam Party (@JaiTDP) August 7, 2024
నేతన్నలకు రూ.67 కోట్లు ఇచ్చి న్యాయం చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. నేతన్నలు సామూహికంగా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పారు. చేనేత మగ్గాల కోసం రూ.50 వేలు సాయం చేస్తామన్నారు. చేనేత వస్త్రాలకు ఆన్లైన్ మార్కెటింగ్ను ప్రోత్సహిస్తాం. చేనేత మరమగ్గాల కార్మికులకు, సౌర విద్యుత్ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్ అందిస్తాం. చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా చేనేతలో సహజ రంగులను ప్రోత్సహిస్తామని చంద్రబాబు తెలిపారు. మరోవైపు, చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. ఇది పార్లమెంటులో చట్టరూపం దాల్చేలా పోరాటం చేస్తామన్నారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications