జగన్ మార్క్ "బిజినెస్" - ఎన్నికల వేళ గేమ్ ఛేంజర్: ప్రతిపక్షాలు సైలెన్స్..!!
ప్రతిపక్షాలకు..తన పై విమర్శలకు జగన్ ఒక్క సదస్సుతో సమాధానం ఇచ్చారు.
జగన్ కు అభివృద్ధి తెలియదు. జగన్ పాలనలో పెట్టుబడులు రావు. ఇది నిత్యం ప్రతిపక్షాలు చేసే విమర్శలు. వీటన్నింటికీ ఒకే ఒక్క సదస్సుతో సమాధానం. మూడు నెలల సైలెంట్ ఆపరేషన్ ఫలితం. రెండో రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు తరలి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు. రెండు లక్షల కోట్లు పెట్టుబడులు లక్ష్యంగా నిర్ణయిస్తే..ఏకంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులు. ప్రకటనలు కాదు...నేరుగా ఎంఓయూలు. విశాఖ కేంద్రంగా ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి జగన్ షాక్ ఇచ్చారు. తన మార్క్ బిజినెస్ ఏంటో నిరూపించారు. ఇప్పుడు ఇదే ఏపీలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది.

సీఎం జగన్ మార్క్ ఆపరేషన్
ఏపీలో పెట్టుబడుల సదస్సు పై అనేక విమర్శలు వచ్చాయి. సీఎం జగన్ పాలన గురించి తెలిసిన వారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టరని ఆరోపించారు. ఈ నాలుగేళ్ల పాలన అంతా సంక్షేమం చుట్టూనే తిరిగింది..అభివృద్ధి పైన అవగాహణ లేదంటూ విమర్శించారు. ఇప్పుడు వీటికి అన్నింటికి విశాఖ కేంద్రంగా సీఎం జగన్ సమాధానం ఇచ్చారు. జగన్ ఆహ్వానంతో పారిశ్రామిక దిగ్గజాలు విశాఖకు తరలి వచ్చారు. ముఖ్యమంత్రి మూడు నెలల కాలంగా బిజినెస్ హౌస్ లతో నేరుగా మానిటర్ చేసారు. ఏపీలో పెట్టుబడల పై చర్చించారు. వారిని ఒప్పించారు. వారితో ఎంఓయూలకు సిద్దం చేసారు. ఆ తరువాత పారిశ్రామిక వేత్త ల నుంచి కమిట్ మెంట్ వచ్చిన తరువాత అన్నింటినీ క్రోడీకరించి ఎంఓయూలకు సిద్దం చేసారు. అన్నీ కలిసి రూ 13 లక్షల కోట్లు ఏపీకి పెట్టబడులు వచ్చినట్లు ముఖ్యమంత్రి ప్రకటనతో ప్రతిపక్షాలు ఆత్మరక్షణ లో పడ్డాయి. అంబానీ, ఆదానీ వంటి ప్రముఖుల సమక్షంలోనే సీఎం జగన్ ఈ ప్రకటన చేసారు.

జే అంటే జగన్ - జే అంటే జోష్
పారిశ్రామిక వేత్తలు జగన్ పాలన అంటే భయపడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. కానీ, విశాఖ కేంద్రంగా జరిగిన సదస్సులో పారిశ్రామిక వేత్తలే స్వయంగా సీఎం జగన్ ను ప్రశంసించారు. జే అంటే జగన్.. జే అంటే జోష్ అంటూ ప్రముఖ పారిశ్రామిక వేత్త తన ప్రసంగంలో ప్రశంసించారు. ముఖేష్ అంబానీ సైతం కేంద్రంలో మోదీ.. ఏపీలో జగన్ పాలన పైన ప్రశంసలు కురిపించారు. ఎన్నికలకు సిద్దం అవతున్న వేళ ముఖ్యమంత్రి జగన్ ఈ సదస్సును వ్యక్తిగతంగా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నేరుగా ఆయనే రంగంలోకి దిగారు. 20 రంగాల్లో ఏపీలో పెట్టుబడులకు ఉన్న సానుకూల వాతావరణం గురించి వివరించారు. తొలి రోజున రూ 11.87 లక్షల కోట్ల మేర 92 ఎంఓయూలు జరిగాయి. రెండో రోజుల రూ 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 6 లక్షల మందికి ఉపాధి అందుతుందని ప్రభుత్వం చెబుతోంది.
ఎన్నికల వేళ గేమ్ ఛేంజర్
ఇదే సమయంలో ఎనర్జీ రంగంలో ఎన్టీపీసీ ప్రకటించిన పెట్టబడులు పైన ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇటు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ఈ సదస్సు గేమ్ ఛేంజర్ గా అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. సంక్షేమంతో పాటుగాఅభివృద్ధి ..పరిశ్రమలు..ఉపాధి కల్పనలో సీఎం తన సామర్ధ్యం చాటుకోవటానికి ఈ సదస్సు సహకరించిందని చెబుతున్నారు. ఈ సదస్సులో పెట్టుబడులు..ఉపాధి గురించి ప్రకటించిన ముఖ్యమంత్రి..ముగింపు ప్రసంగంలో మరింత స్పష్టత ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు ప్రతిపక్షాల విమర్శలకు ఈ సదస్సు ద్వారా సమాధానం ఇచ్చారని.. ఇప్పుడు వచ్చిన పెట్టబడుల్లో సాధ్యమైనంత త్వరలో గ్రౌండ్ అయ్యేలా చూడటం ఇప్పుడు ప్రభుత్వం బాధ్యతగా ఉంది. ఇక, విశాఖ సదస్సులో పెట్టుబడుల పైన టీడీపీ అధికారికంగా స్పందించ లేదు.-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications