ముహూర్తం ఫిక్స్, అఫీషియల్ - సీఎం జగన్ సిద్దం..!!
ఎన్నికల వేళ సీఎం జగన్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. విశాఖ నుంచి పాలనకు సీఎం సిద్దమయ్యారు. ఇప్పటికే దీని పైన స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన సీఎం..ఇక నుంచి వారంలో రెండు రోజులు విశాఖలోనే ఉండేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. దసరా నుంచి పాలన ప్రారంభానికి ముమూర్తం అధికారికంగా ఖరారైంది. దీంతో, సీఎం క్యాంపు కార్యాలయంతో పాటుగా మంత్రులు..అధికారుల కోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.
విశాఖ నుంచి పాలన: విశాఖ నుంచి పాలనకు ముహూర్తం ఖరారైంది. ఇప్పటి వరకు దసరా నుంచి అని చెబుతున్నా..ఇప్పుడు అధికారికంగా నిర్దారించారు. అక్టోబర్ 23న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి గృహ ప్రవేశానికి ముహూర్తం కూడా ఖరారైంది. 24 నుంచి సీఎం జగన్ వైజాగ్ క్యాంప్ ఆఫీస్ నుంచి పాలన కొనసాగించనున్నారు.

విశాఖపట్నం-భీమిలి బీచ్ రోడ్డులోని.. రుషికొండపై ఏపీ టూరిజం శాఖ నిర్మిస్తున్న కాంప్లెక్స్లోనే సీఎం నివాసం ఉండనున్నట్లు సమాచారం. సీఎం విశాఖ పాలనపై ఎంపీ విజసాయిరెడ్డి సైతం తాజాగా స్పందించారు. ఇక నుంచి మంత్రివర్గ సమావేశాలు విశాఖ కేంద్రంగానే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ వ్యవహారాలు అమరావతిలో కొనసాగనున్నాయి.
తుది కసరత్తు: సీఎంఓ విశాఖ నుంచి పని చేసినా..సచివాలయం మాత్రం అమరావతితోనే కొనసాగనుంది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి సంబంధించి ఈ నెల 15-20 తేదీల్లో పనులు పూర్తవుతాయని తెలుస్తోంది. భద్రతా అంశాలను పరిగణలోకి తీసుకోవటంతో పాటుగా అన్ని సౌకర్యాలతో నిర్మాణం పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ప్రభుత్వ భవనాలు..అవసరమైన చోట కొన్ని ఇళ్లను అందుబాటులోకి తెస్తున్నారు.
విశాఖ బీచ్ రోడ్డులో ఇప్పటికే కొన్ని ఇళ్లకు సంబంధించి అగ్రిమెంట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా విశాఖలో పర్యటించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధికార యంత్రాగానికి సూచనలు చేసారు. త్వరలోనే విశాఖలో ఊహించని అభివృద్ధి కనిపిస్తుందని అధికారులు చెబుతున్నారు.

రాజకీయంగా కీలకం: సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రస్తుతం ఇంటీరియర్ వర్క్స్, దర్వాజాలు, ఇతర ఫినిషింగ్ టచెస్ జరుగుతున్నాయని తెలుస్తోంది. విశాఖ నగరంలో రోడ్ల అనుసంధానం పైన కసరత్తు జరుగుతోంది. ఈ నెలలోనే విశాఖలో కొత్త మార్పులు కనిపిస్తాయని చెబుతున్నారు. దసరా నుంచి దాదాపుగా ఏపీలో అన్ని పార్టీలు ఎన్నికల బరిలోకి దిగనున్నాయి.
మేనిఫెస్టోల ప్రకటన..అభ్యర్దుల ఖరారు పైన ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. ఇక, విశాఖ నుంచి పాలన చేయటం ద్వారా రాజకీయంగా తమకు కలిసి వస్తుందని వైసీపీ అంచనా వేస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల వేళ..ఇప్పుడు విశాఖ కేంద్రంగా చోటు చేసుకొనే పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications