Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహిళల ఖాతాల్లో రూ 15 వేలు చొప్పున జమ చేయనున్న సీఎం జగన్..!!

ఎన్నికల వేళ ముఖ్యమంత్రి జగన్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంక్షేమ పథకాల అమలులో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నిధులు విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 22న వైఎస్సార్ కాపు నేస్తం నిధులను సీఎం జగన్ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందుకోసం వ్యూహాత్మకంగా నిడుదవోలును ఎంచుకున్నారు. వరుసగా నాలుగో ఏడాది దాదాపు 35 లక్షల మంది మహిళలకు లబ్ది జరగనుంది.

కాపు నేస్తం నిధులు విడుదల: రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపున్న మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15వేల చొప్పున సాయం అందిస్తోంది. అంటే ఐదేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం మహిళలకు ఇస్తోంది. ఈ నెల 22న కాపు నేస్తం పథకం నిధుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు.

CM Jagan to Release Kapu Nestham Fourth Phase Funds in Nidadavolu on 22nd August

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జరిగే కార్యక్రమంలో సీఎం బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్‌లలో డబ్బుల్ని జమ చేస్తారు. తొలి రెండు విడతల్లో రూ 490 కోట్లు చొప్పున, మూడో విడతలో 3,38,792 మంది మహిళ ఖాతాల్లో రూ.508 కోట్లు సీఎం జగన్ జమ చేసారు. కాపు నేస్తం పథకంపై మూడేళ్లలో రూ.1,492 కోట్లు ఖర్చు చేశారు.

నిడుదోలు కేంద్రంగా అమలు: మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్ఆర్ కాపునేస్తం పేరుతో ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేల చొప్పున జమ చేస్తోంది. తాజాగా నిర్వహించిన జగన్న సురక్ష ద్వారా అర్హత ఉంది పథకం అందని లబ్దిదారులకు మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నవరత్నాల్లో పథకాల ద్వారా మూడేళ్లలో కాపు సామాజిక వర్గానికి రూ.16,256 కోట్లు లబ్ధి చేకూర్చినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకు సీఎం గా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత 50 నెలల కాలంలో రూ 2.45 లక్షల కోట్ల మేర వివిధ పథకాల ద్వారా లబ్దిదారులకు ప్రభుత్వం నుంచి మేలు జరిగింది. ఇప్పుడు వరుసగా నాలుగో ఏడాది నిధులను రాజకీయంగా కీలకమైన గోదావరి జిల్లా నుంచి సీఎం జగన్ విడుదల చేయనున్నారు.

ఒక్కో లబ్దిదారుకు రూ 15 వేలు: కుటుంబ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000/- లోపు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.12,000/- వేల లోపు ఆదాయం ఉండాలి. కాపు నేస్తానికి సంబంధించి కుటుంబానికి గరిష్టంగా మూడు ఎకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట భూమి.. మాగాణి మెట్ట రెండూ కలిపి పది ఎకరాలకు మించకూడదు.

ఎన్నికల పొత్తుల్లో భాగంగా టీడీపీ, జనసేన సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకున్నాయి. గోదావరి జిల్లాల్లో సామాజిక సమీకరణాలను అనుకూలంగా మలచుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు సీఎం జగన్ నిడుదవోలు కేంద్రంగా కాపునేస్తం నిధుల విడుదల..బహిరంగ సభలో చేసే ప్రసంగం పైన ఆసక్తి కొనసాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+