Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైతుల ఖాతాల్లోకి సీఎం జగన్ నిధుల విడుదల..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాను అమలు చేస్తున్న సంక్షేమం మరోసారి తనకు అధికారం ఇస్తుందనే నమ్మకంతో సీఎం జగన్ ఉన్నారు. సంక్షేమ క్యాలెండర్ ను అమలు చేస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి వరకు పథకాల అమలుకు సంబంధించి సీఎం జగన్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. అందులో భాగంగా ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి పుట్టపర్తి కేంద్రంగా వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ నిధుల విడుదలకు నిర్ణయించారు.

ఈ నెల 7న విడుదల:ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 7వ తేదీన రైతు భరోసా - పీఎం కిసాన్ నిధులు విడుదల చేయునున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రైతులకు ఏటా రూ.7,500 పెట్టుబడి సాయం కింద అందజేస్తోంది. ఇది మూడు విడతల్లో అందజేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 50నెలల్లో రాష్ట్రంలోని 52.50లక్షల మందికి 31వేల కోట్ల రుపాయలను పిఎం కిసాన్‌ వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా అందించారు. రైతు భరోసాతో బయట అప్పులు చేయాల్సిన అవసరం రైతులకు రాదని చెప్పారు.రైతులకు సమయానికి తగ్గట్టుగా డబ్బులు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. వ్యవసాయంలో నష్టపోకుండా ఉండే పరిస్థితి రైతు భరోసా ద్వారా నాలుగేళ్లుగా అమలు చేస్తున్నట్లు పేర్కొంది.

CM Jagan to release YSR Rythu Bharosa Funds on 7th November at Puttaparthi

70 శాతం మంది రైతులకు మేలు:పిఎం కిసాన్, రైతు భరోసా కార్యక్రమం ద్వారా 70శాతం రైతులకు ఎంతో మేలు చేస్తోందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో అర హెక్టారులోపు 1.25ఎకరాల్లోపు ఉన్న రైతులు 60శాతం మంది ఉన్నారు. రైతుల్లొ రెండున్నర ఎకరాల్లోపు ఉన్న వారు 70శాతం వరకు ఉన్నారు. రూ.13,500 పెట్టుబడి సాయం అరవై శాతం రైతులకు 80శాతం పంటలకు 80శాతం పెట్టుబడి సహాయంగా ఉపయోగ పడుతుందని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. రైతులకు సమయానికి తగ్గట్టుగా డబ్బులు అందిస్తున్నామని చెప్పారు. వ్యవసాయంలో నష్టపోకుండా ఉండే పరిస్థితి రైతు భరోసా ద్వారా నాలుగేళ్లుగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. పిఎం కిసాన్, రైతు భరోసా కార్యక్రమం ద్వారా 70శాతం రైతులకు ఎంతో మేలు చేస్తోందని వివరించారు.

రైతులకు అండగా:ప్రతి గామంలో గతంలో లేని విధంగా ఆర్బీకే వ్యవస్థను ఏర్పాట్లు చేశామని 10,778ఆర్బీకేలు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసి సహాయం అందిస్తున్నారు. బ్యాంకింగ్ సేవలు, కియోస్క్‌ల ద్వారా కల్తీ లేని విత్తనాలు అందిస్తున్నామని, ఈ క్రాప్ నమోదు చేసి ఏ ఎకరాలో ఏ పంట వేశారనేది కూడా నమోదు చేస్తున్నామన్నారు. సోషల్ ఆడిట్‌లో జాబితాలు మొత్తం ప్రత్యక్షమవుతున్నాయి. ఇన్‌ఫుట్‌ సబ్సిడీల్లో కూడా ఇలాంటి మంచి జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. కౌలు రైతులతో పాటు దేవదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న సాగుదారులతో కలిపి రైతులందరికి అందిస్తోన్న వైఎస్సార్‌ రైతు భరోసా పథకం అమలు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+