'వైసిపికి 35 సీట్లకు మించవు, ఇదీ జగన్కు ప్రశాంత్ కిషోర్ చెప్పింది'
ఎన్నికలు వస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 30 - 35కు మించి సీట్లు రావని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రతిపక్ష నేత జగన్కు నివేదిక ఇచ్చారని టిడిపి ఎంపీ సిఎం రమేష్ సోమవారం అన్నారు.
అమరావతి: ఎన్నికలు వస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 30 - 35కు మించి సీట్లు రావని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రతిపక్ష నేత జగన్కు నివేదిక ఇచ్చారని టిడిపి ఎంపీ సిఎం రమేష్ సోమవారం అన్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆ పార్టీకి అంతకుమించి సీట్లు రావని సీఎం రమేష్ అన్నారు. స్వయంగా ప్రశాంత్ కిషోరే ఈ మేరకు రిపోర్ట్ ఇవ్వడం గమనార్హం అన్నారు.
వైసిపి ప్లీనరీలో జగన్ అన్నీ అవాస్తవాలే చెప్పారన్నారు. జగన్కు తన సామర్థ్యంపై నమ్మకం లేకనే కన్సల్టెంటుగా ప్రశాంత్ కిషోర్ను నియమించుకున్నారని చెప్పారు.

ఈడీ కొత్తగా ఏ ఆస్తులు అటాచ్ చేస్తుందోనని జగన్ టెన్షన్తో ఉన్నారని చెప్పారు. అందుకే జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఏపీ కోసం కఠోర శ్రమ పడుతున్న చంద్రబాబుపై బురద చల్లాలనుకుంటే జగన్ ఉన్న ఉనికిని కూడా కోల్పోతారన్నారు.
ప్రశాంత్ కిషోరే తనను గెలిపిస్తాడని జగన్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అంటే జగన్ స్థాయి ఏమిటో తెలుసుకోవాలని ప్రజలకు చెప్పారు. మీ పార్టీకి దమ్ము లేనప్పుడు ప్రశాంత్ కిషోర్ మాయలు మంత్రాలు చేసి గెలిపిస్తాడా అన్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications