సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్: మళ్లీ టీటీడీలోకి రమణదీక్షితులు, ప్రత్యేక బాధ్యతల అప్పగింత
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆగమ సలహాదారుడిగా రమణదీక్షితులు నియమితులయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో టీటీడీ రమణదీక్షితులను తిరిగి విధుల్లోకి తీసుకుంది. ఈ మేరకు మంగళవారం టీటీడీ ఉత్తర్వులను జారీ చేసింది.
గతంలో రమణదీక్షితులు శ్రీవారి ఆలయ ప్రధానార్చకుడిగా విధులు నిర్వర్తించారు. సుమారు ఏడాదిన్నర క్రితం ఆయన శ్రీవారి ఆలయ విధులకు దూరమయ్యారు. తాజాగా సీఎం జగన్ ఆదేశాలతో మళ్లీ ఆయన్ను విధుల్లోకి తీసుకున్నారు.

ఓ వైపు ఆగమ సలహాదారుడిగా ఉంటూనే యువ అర్యకులకు శిక్షణ ఇచ్చే అదనపు బాధ్యతలను రమణదీక్షితులకు అప్పగించారు. వైఖానస ఆగమశాస్త్రంలో ఆయన అనుభవం, పరిజ్ఞానం ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావించినందువల్లే ఈ నియామకం జరిగినట్లు తెలుస్తోంది.
తన నియామకం నేపథ్యంలో రమణదీక్షితులు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని కలిశారు. కాగా, కోర్టు కేసుల పరిష్కారం తర్వాత అర్చకత్వ బాధ్యతలు కూడా అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిలో భాగంగా రమణ దీక్షితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక రమణదీక్షితులు ఇద్దరు కుమారులను గోవిందరాజు స్వామి ఆలయం నుంచి తిరిగి తిరుమల ఆలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
వృద్దులు, 12 ఏళ్లలోపు పిల్లలకు టీటీడీ ముఖ్య గమనిక -
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
ఈ నెల 30 నుంచి తిరుమలలో -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications