ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీరే: తాజా జాబితాలో 9 మంది పేర్లు
న్యూఢిల్లీ/అమరావతి: కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థులతో కూడిన మరో జాబితాను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 పార్లమెంట్ స్థానాలకు, జార్ఖండ్ రాష్ట్రంలో రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ ఆదివారం రాత్రి జాబితాను విడుదల చేసింది.
మొత్తం 11 మందితో తాజా జాబితాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. ఏపీకి సంబంధించిన తొలి జాబితాలో 6, రెండో జాబితాలో 5 స్థానాలకు గతంలోనే కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజా కాంగ్రెస్ అభ్యర్థులు వీరే:
శ్రీకాకుళం: పీ పరమేశ్వరరావు
విజయనగరం: బొబ్బిలి శ్రీను
అమలాపురం: జంగా గౌతమ
మచిలీపట్నం: గొల్లు కృష్ణ
విజయవాడ: వల్లూరు భార్గవ్
ఒంగోలు: ఈద సుధాకర్ రెడ్డి
నంద్యాల: జే లక్ష్మీ నరసింహ యాదవ్
అనంతపురం: మల్లిఖర్జున్ వజ్జల
హిందూపురం: బీఏ సమద్ షహీన్.
కాగా, ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలు ఉండగా, జార్ఖండ్లో మొత్తం 14 లోక్సభ స్థానాలు ఉన్నాయి. జార్ఖండ్లోని గొడ్డాలో దీపికా సింగ్ పాండే స్థానంలో ప్రదీప్ యాదవ్ను కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిపింది. ఏప్రిల్ నెల ప్రారంభంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లోని ఆరు లోక్సభ స్థానాలు, 12 అసెంబ్లీ స్థానాల జాబితాను విడుదల చేసింది.
లోక్సభ ఎన్నికల ఓటింగ్ ఏప్రిల్ 19న ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న ఫలితాలు ప్రకటించబడతాయి. మొత్తం 543 స్థానాల్లో 102 స్థానాలకు ఏప్రిల్ 19న మొదటి దశ ఓటింగ్ జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లోని 60 అసెంబ్లీ స్థానాలకు , సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి . ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
మే 13న ఆంధ్రప్రదేశ్లో ఏకకాలంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 స్థానాల్లో అఖండ మెజారిటీతో గెలుపొందగా , టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. లోక్సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 22 స్థానాల్లో గెలుపొందగా, టీడీపీ మూడు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది.












Click it and Unblock the Notifications