మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం, మరో మలుపు: రంగంలోకి కాంగ్రెస్, ఖర్గే నోటీసు

న్యూఢిల్లీ: లోకసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే శుక్రవారం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఇప్పటికే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు అవిశ్వాసం నోటీసు ఇస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ అదే బాటలో నడిచింది.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

కాంగ్రెస్ కూడా అవిశ్వాసం నోటీసు ఇవ్వడం ప్రత్యేక హోదా అంశంలో మరో కీలక పరిణామం. ప్రత్యేక హోదా కల్పన, విభజన హామీల అమలులో ఎన్డీయే సర్కార్ విఫలమైందంటూ అవిశ్వాసం నోటీసులు ఇచ్చింది.

Congress files notice for No Confidence Motion against Centre

మల్లికార్జున ఖర్గే లోకసభ జనరల్ సెక్రటరీని కలిసి వీటిని అందించారు. ఆయన వెంట ఏపీ ఎంపీ జేడీ శీలం తదితరులు ఉన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి అనకూలంగా చాలామంది ఎంపీలు మద్దతు ఇచ్చారని, ఎట్టి పరిస్థితుల్లో చర్చకు అవకాశం కల్పించాల్సిందేనని జేడీ శీలం అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేదాకా కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు విడివిడిగా ఇచ్చిన నోటీసులు చర్చకు వచ్చినా తాము మద్దతిస్తామని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అవిశ్వాసం రంగంలోకి దిగడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+