కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు కన్నుమూత
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు(75) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

పాలడుగు మృతికి కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు. పాలడుగు స్వస్థలం కృష్ణా జిల్లా ముసనూరు మండలం గోగులంపాడు గ్రామం. 1968లో యువజన కాంగ్రెస్లో చేరిన పాలడుగు 1972లో తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
నూజివీడు శాసనసభ స్థానం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంజయ్య, భవనం వెంకట్రామిరెడ్డి, నేదురుమల్లి కేబినెట్లో పాలడుగు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. పాలడుగు వెంకట్రావు ప్రస్తుతం ఎమ్మెల్సీ కొనసాగుతున్నారు.
కాగా, వెంకట్రావు మృతికి తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు. పాలడుగు కుటుంబ సభ్యులకు తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్, సీనియర్ నేత జానారెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా పాలడుగు పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications