ఏపీ, తెలంగాణ కోసం కేన్సర్ సెంటర్, కేసీఆర్చే ప్రారంభం
హైదరాబాద్: కేన్సర్ నిరోధానికి అత్యాధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. సరికొత్త టెక్నాలజీతో తయారైన ఆధునిక పరికరాల ద్వారా అన్ని రకాల కేన్సర్లకు ఆసుపత్రుల్లో వైద్యం అందుబాటులోకి వస్తోంది. ఈ తరుణంలో భాగ్యనగరంలోని ది కాంటినెంటల్ ఇంటర్నేషనల్ కేన్సర్ సెంటర్ అందుబాటులోకి రానుంది.

ఈ సెంటర్ను ఈ నెల 27న (శనివారం) ఉదయం పదిన్నర గంటలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రారంభిస్తారు.
ఈ సందర్భంగా గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంటినెంటల్ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ రమణ, మూర్తి చిట్టి, కార్పోరేట్ కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డాక్టర్ అనురాధ రెడ్డిలు మాట్లాడారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ది కాంటినెంటల్ ఇంటర్నేషనల్ కేన్సర్ సెంటర్ ద్వారా వైద్య సేవలు మెరుగుపరుస్తామని చెప్పారు. అన్ని రకాల కేన్సర్లకు ఇక్కడ చికిత్సలు అందుబాటులో ఉంటాయని వారు వెల్లడించారు.












Click it and Unblock the Notifications