వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాదులో జగన్ సమైక్య సభకు పోలీసులు నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్య శంఖారావానికి హైదరాబాదు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నెల 19న ఎల్బీ స్టేడియంలో జగన్ పార్టీ సమైక్య శంఖారావం నిర్వహించాలని భావించింది.

అయితే శాంతిభద్రతలకు భంగం వాటిల్లే అవకాశాలు ఉన్నందున అనుమతి ఇవ్వలేదని డిసిపి కమలాకర్ రెడ్డి శనివారం తెలిపారు. సీమాంధ్ర ప్రాంతంలో కొనసాగుతున్న ఆందోళనలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎపిఎన్జీవోల సమ్మ నేపథ్యంలో ఈ సభను నిర్వహిస్తే ఉద్రిక్తత నెలకొని, గొడవలు జరిగే అవకాశఁ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Cops deny permission to YSRCP meet

ఎట్టి పరిస్థితుల్లోను సభ నిర్వహించేందుకు వీలులేదని తాము లిఖిత పూర్వకంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి లేఖ రాసినట్లు తెలిపారు.

మాకెందుకివ్వరు?: మైసూరా

హైదరాబాదులో కొన్ని రాజకీయ శక్తులకు ఇలాంటి సభలు నిర్వహించడం ఇష్టం లేకపోతే ఇతర ప్రజల హక్కులను ఎలా కాలరాస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత మైసూరా రెడ్డి ప్రశ్నించారు. అందరికిచ్చి తమకు సభ నిర్వహణకు ఎందుకు అనుమతివ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతి నిరాకరణ ఉత్తర్వులు పోలీసుల ఆర్డరా లేక పొలిటికల్ ఆర్డరా చెప్పాలన్నారు.

English summary
The Hyderabad police denied permission to YSR Congress Party to organise a public meeting here on October 19 in support of united Andhra Pradesh on the ground that it may create a law and order problem.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X