ఏపీలో కరోనా అనుమానితురాలు మృతి .. కరోనా ప్రభావంతో హైకోర్టు కీలక నిర్ణయం
కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. తాజాగా ఇప్పుడు ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో ఏపీ వాసులు భయపడుతున్నారు. ఇక తాజాగా కరోనా అనుమానిత లక్షణాలున్న మహిళ మృతి చెందింది. కాకినాడ ఐసొలేషన్ వార్డులో చికిత్స పొందుతూ అంతర్వేదిపాలెం కు చెందిన మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇటీవలే దుబాయ్ నుంచి అంతర్వేదిపాలెం ఆమె వచ్చినట్లు గ్రామస్థులు చెప్పారు. అయితే కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించి నిన్న కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఆమెను అడ్మిట్ చేశారు. ప్రాథమికంగా మెదడువాపుతో మృతి చెందినట్లు భావిస్తున్నామని, కరోనా పరీక్షలు రిపోర్టు రావాల్సి ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఏది ఏమైనా ఏపీలోనూ కరోనా కలకలం నేపధ్యంలో ప్రజలు భయపడుతున్నారు.
ఏపీ సర్కార్ కరోనా వ్యాప్తి చెందకుండా అప్రమత్తం అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడ పడితే అక్కడ కరోనా వ్యాపిస్తుంది అని ప్రజలు తీవ్రంగా భయాందోళనలకు గురవుతున్న వేళ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది . ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చెయ్యటమే కాదు తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది . ఇప్పటికే కరోనా బాధిత వ్యక్తి ఉన్న నెల్లూరు జిల్లాలో విద్యాసంస్థలు, థియేటర్లు మూసివేసిన సర్కార్ , ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాలలో కూడా బయో మెట్రిక్ విధానాన్ని తీసివేసి ఫిజికల్ అటెండెన్స్ తీసుకోవాలని పేర్కొంది.

ఇక తాజాగా ఏపీ హైకోర్టు కూడా కరోనా ఎఫెక్ట్ నేపధ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది . కరోనా ఎఫెక్ట్తో రేపటి నుంచి అత్యవసర కేసులు మాత్రమే ఏపీ హైకోర్టు విచారించనుంది. హైకోర్టుకు వచ్చేవారికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. గుంపులుగా జనాలు లేకుండా చూడాలని , హైకోర్టుకు వచ్చే వారికి కూడా జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని నిర్ణయం తీసుకుంది . ఈనెల 30 వరకు కోర్టుకు వచ్చే లాయర్లు, ప్రజలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే లోపలికి అనుమతి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications