ycp లో ముసలం.. నాయకత్వంపై తిరుగుబాటు.. అజ్ఞాతంలో 10 మంది నాయకులు
అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముసలం రేగింది. కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయితీలో ఆ పార్టీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు సమావేశానికి రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. స్థానిక నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. రాజకీయంగా ఈ విషయం కృష్ణా జిల్లావ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అజ్ఞాతంలోకి వెళ్లిన కౌన్సిలర్లు తాము విజయం సాధించినా కనీస విలువ కూడా ఇవ్వడంలేదని కొంతకాలం నుంచి వారు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నప్పటికీ పార్టీ నాయకత్వం పెడచెవిన పెట్టింది. దాని ఫలితమే వారంతా ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లారు.

రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తి?
నందిగామ నగర పంచాయితీలో మొత్తం 20 వార్డులు ఉండగా, 13 వార్డుల్లో తెలుగుదేశం, ఆరు వార్డుల్లో తెలుగుదేశం, మరొక వార్డులో జనసేన అభ్యర్థులు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. పూర్తిస్థాయిలో మెజారిటీ సాధించడంతో మండవ వరలక్ష్మిని చైర్ పర్సన్ గా ఎన్నుకున్నారు. కమిషనర్ జయరాం తమకు విలువివ్వడంలేదంటూ వరలక్ష్మి అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిపాలన కూడా కొన్నాళ్లు స్తంభించింది. కమిషనర్ తోపాటు స్థానిక నాయకుల వైఖరిపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సమయంలో జరిగిన కౌన్సిల్ సమావేశాలు కూడా ఇబ్బందికర పరిణామాల మధ్య జరిగాయి. వైసీపీ నేతలు ఆమెతో మాట్లాడి సర్దుబాటు చేశారు. అనారోగ్యానికి గురవడంతో మార్చి నుంచి చికిత్స పొందుతున్నారు.

వైస్ చైర్మన్ గా మాడుగుల నాగరత్నం
ఈ సందర్భంగా పరిపాలన కోసం వైస్ చైర్ పర్సన్ మాడుగుల నాగరత్నంను ప్రభుత్వం నియమించింది. ఆమె బాధ్యతలు స్వీకరించేరోజు తమకు సమాచారం ఇవ్వలేదని, తమ అనుమతి లేకుండా, తమ ప్రమేయం లేకుండా తమ వార్డుల్లో పనులు జరుగుతున్నాయని, ప్రజలకు పనులకు సంబంధించి ఏం చెప్పుకోవాలో అర్థంకాక పరువు పోతోందన్నారు.

అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు
తమవార్డుల్లో పనుల గురించి అధికారులును కలిసినా ేమీ మాట్లాడంలేదని, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, అజ్ఞాతంలోకి వెళ్లిన కౌన్సిలర్ల కోసంముఖ్య నాయకులు ప్రయత్నించినా ఫలితం కనపడలేదు. అసమ్మతి కౌన్సిలర్లంతా ఒకచోట సమావేశమైన వీడియో సోమవారం సాయంత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ నందిగామ వ్యవహారం వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications