ఏపీలో కరోనా: భారీగా తగ్గిన కేసులు -కొత్తగా కేవలం 128 కేసులు, 3 మరణాలు
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ భారీగా తగ్గాయి. ఏడు నెలల వ్యవధిలో అత్యల్ప స్థాయిలో పడిపోయాయి. సెలవు రోజు కావడంతో నిన్న టెస్టుల సంఖ్య తగ్గిపోగా, అందుకు తగ్గట్లే కేసులు కూడా తగ్గాయి. మరోవైపు డిశ్చార్జీల సంఖ్య పెరగడంతో యాక్టివ్ కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి..
Recommended Video
ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 29,714 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 128 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,83,210కి చేరింది.

కరోనా మహమ్మారి బారిన పడి సోమవారం ముగ్గురు మరణించారు. చిత్తూరు జిల్లాలో ఒకరు, నెల్లూరులో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు కరోనా వల్ల చనిపోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారికి బలైపోయినవారి సంఖ్య 7,118కు చేరింది.
ఏపీలు కొత్తగా 252 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 8,73,149కి చేరింది. యాక్టివ్ కేసులు 2,943కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,20,02,494 శాంపిల్స్ను పరీక్షించినట్లు బులెటిన్లో పేర్కొన్నారు.
జిల్లాల వ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య చూస్తే, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 21 కొత్త కేసులు, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా ఒక్క కరోనా కేసు నమోదైంది. విజయనగరం జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు సైతం రాష్ట్రంలోనే అత్యల్పంగా 35 ఉన్నాయి.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications