ఏపీలో పెరుగుతున్న కోవిడ్ ప్రభావం-ఈ జిల్లాల్లో ఎక్కువగా యాక్టివ్ కేసులు..!
ఏపీలో కోవిడ్ 19 వైరస్ ప్రభావం మళ్లీ పెరుగుతోంది. పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల కేసుల సంఖ్య గోప్యంగా ఉంటోంది. వైరస్ లక్షణాలు కనిపించిన తర్వాత జనం ఆస్పత్రుల బాట పడుతున్నారు. దీంతో వాస్తవ కేసుల సంఖ్య తెలియడం లేదు.
రాష్ట్రంలో గత 24 గంటల్లోనే అనకాపల్లి జిల్లాలో మూడు కోవిడ్ కేసులు, విశాఖ జిల్లాలో రెండు, శ్రీకాకుళం జిల్లాలో ఓ కేసు నమోదైంది. వీటితో కలుపుకుని రాష్ట్రంలో ప్రస్తుతం 29 యాక్టివ్ కేసులున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే అనధికారికంగా కోవిడ్ లక్షణాలతో ఆస్పత్రుల పాలవుతున్న వారు, ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో కోవిడ్ వాస్తవ పరిస్ధితి అర్ధం కావడం లేదు.

రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా లేకపోవడంతో ప్రభుత్వం రెగ్యులర్ పరీక్షలు నిర్వహించడం లేదు. మరోవైపు శీతాకాలం కావడంతో వైరస్ లక్షణాలు ఉన్నా జనం సహజమే అనుకుంటున్నారు. దీంతో వీరు ఆస్పత్రులకు వెళ్లడం ఆలస్యమవుతోంది. ఈలోపు వైరస్ లక్షణాలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికారికంగా కోవిడ్ పరీక్షలు ప్రారంభించాలని జనం కోరుతున్నారు. ఈసారి ఒమిక్రాన్ జేఎన్1 వైరస్ కేసులు ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్ర సరిహద్దులతో పాటు విమానాశ్రయాలు, బస్టాండ్లలోనూ కోవిడ్ నిబంధనలు అమలు కావడం లేదు. ప్రభుత్వం సాధారణ అలర్ట్ ఇచ్చి వదిలేసింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి కోవిడ్ సోకిన వారు కుప్పలు తెప్పలుగా రాష్ట్రంలోకి వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరి వల్ల రాష్ట్రంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు, కాంటాక్టులకు వైరస్ సోకుతోంది. దీని ప్రభావం తెలియాలంటే మరో వారం రోజులుగా ఆగాలని డాక్టర్లు చెబుతున్నారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications