జేపీకి ఉద్యోగుల అల్టిమేటం - రెండు పెన్షన్లు తీసుకుంటూ..!!
మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ పైన ఉద్యోగులు మండి పడుతున్నారు. ఓపీఎస్ (పాత ఫించన్ పథకం) పునరుద్దరిస్తే దేశం దివాలా తీస్తుందంటూ జేపీ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగ వర్గాల్లో దుమారం రేపాయి. ఉద్యోగులకు అన్యాయం చేసేలా మాట్లాడటం ఏంటని నిలదీస్తున్నాయి. మాజీ ప్రభుత్వ అధికారిగా..మాజీ ఎమ్మెల్యేగా రెండు ఫించన్లు తీసుకుంటున్న జేపీ..ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలోని జేపీ వస్తే నిలదీస్తామని హెచ్చరిస్తున్నాయి.
వ్యాఖ్యల దుమారం: ఉద్యోగులకు ఓపీఎస్ పైన తాజాగా జేపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీని పైన ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారిగా..మేధావిగా పేరుండి..ఉద్యోగుల బాధలు..ఇబ్బందులు తెలిసిన వ్యక్తిగా ఉద్యోగుల పక్షాన మాట్లాడాల్సింది పోయి, రివర్స్ లో ఉద్యోగులకు అన్యాయం చేసేలా మాట్లాడటం ఏంటని నిలదీస్తున్నారు. కార్పోరేట్ శక్తులకు రూ 25 లక్షల కోట్ల రుణామాఫీ చేస్తే రాని ఆర్దిక సంక్షోభం..సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ ఇస్తే ఎలా వస్తుందో జేపీ సమాధానం చెప్పాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఉద్యోగ సంఘాల ఆగ్రహం: 30-35 ఏళ్ల పాటు ప్రభుత్వ సేవ చేసిన ఉద్యోగి భద్రతతో కూడా ఫించన్ పొందాలనుకోవటం ప్రజాస్వామ్యబద్దమైన కోరిక కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీగా పని చేసి ఉంటే ప్రతీ పదవికి విడివిడిగా ఫింఛన్ తీసుకుంటూ ఉద్యోగులకు మాత్రం ఓపీఎస్ పునరుద్దరిస్తే కొంపలు అంటుకుపోతాయా అని నిలదీస్తున్నారు.
కొత్త పెన్షన్ విధానం వచ్చినా పాత పెన్షన్ విధానమే అమలు చేస్తున్న పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల ఆర్దిక వ్యవస్థ ఏనాడు కుప్ప కూలలేదని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. ఆర్టికల్ 309 ప్రకారం సీపీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను ప్రవేశ పెట్టే అధికారం ఉందని రాజస్థాన్, చత్తీస్ ఘడ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాయ్, కర్ణాటక, సిక్కిం రాష్ట్రాలు నిరూపిస్తున్న తరుణంలో ఇంకా ఓపీఎస్ పునరుద్దరణ పై విష ప్రచారం చేయటం మానుకోవాలని ఉద్యోగ సంఘాలు సూచిస్తున్నాయి.
రెండు పెన్షన్లు తీసుకోవటం లేదా: ఇదే సమయంలో రాజకీయ లబ్ది కోసమే జేపీ ఈ విధంగా మాట్లాడుతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేపీ ఏపీలోకి వస్తే నిలదీస్తామని హెచ్చరిస్తున్నారు. జేపీ రెండు పెన్షన్లు తీసుకుంటూ..ఉద్యోగులకు ఓపీఎస్ అవసరం లేదని ఎలా చెబుతారని నిలదీస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీపీఎస్ విధానం గురించి మాట్లాడకుండా.. ఇలాంటి వ్యాఖ్యలు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, ఇప్పుడు ఉద్యోగుల ఆగ్రహం పై జేపీ ఎలా స్పందిస్తారో చూడాలి.
-
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!











Click it and Unblock the Notifications