అమరావతి నిర్మాణం కోసం ఆ 30 మందికి పిలుపు...!!
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. వచ్చే రెండు నెలల కాలంలో పనుల ప్రారంభానికి టెండర్లు పిలవాలని నిర్ణయించారు. అటు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ అమరావతికి రూ 15 వేల కోట్ల రుణంకు ఆమోదించింది. ముందుగా మధ్యలో నిలిచిన నిర్మాణాల పూర్తి పైన సీఆర్డీఏ ఫోకస్ చేసింది. ఇదే సమయంలో సీఆర్డీఏ అమరావతి పనుల కోసం ప్రత్యేకంగా 30 మంది కన్సల్టెంట్లను నియమించుకునేందుకు సిద్దమైంది.
కన్సెల్టెంట్లు
అమరావతి నిర్మాణ పనుల కు సంబంధించి కార్యాచరణ సిద్దం అవుతోంది. టెండర్లు పిలిచేలా కసరత్తు మొదలైంది. ఇందుకు సంబంధించిన పనులు సీఆర్డీఏ ప్రారంభించింది. అసంపూర్తిగా నిర్మాణాలు జరిగిన వాటిని ముందుగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం టెండర్లను వచ్చే నెల పిలవనున్నారు. ఇక, ప్రపంచ బ్యాంకు.. ఏడీబీ నుంచి వచ్చే రూ 15 వేల కోట్ల రుణం తో చేపట్టే పనుల గురించి ఇప్పటికే సీఆర్డీఏ ప్రాజెక్టు రిపోర్టు సమర్పించింది. ఆ పనుల ఖరారు కోసం కన్సెల్టీల నియామకం చేసుకోవాలనే సూచనలు అందాయి.

కసరత్తు
దీంతో, అమరావతి పరిధిలో సీఆర్డీఏ చేపట్టే వేర్వేరు పనుల కోసం మొత్తంగా 30 మంది కన్సెల్టీల కోసం సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించనుంది. ఖరారైన కన్సెల్టెన్సీ సంస్థ ఇచ్చే డీపీఆర్ ఆధారంగా పనులు ముందుకు వెళ్లనున్నాయి. ఈ కన్సెల్టెన్సీల నియామకం పైన ఇప్పటికే సీఆర్డీఏ కసరత్తు పూర్తి చేసింది. నిర్మాణాలకు టెండర్లు పిలవటానికి ముందే ఈ కన్సెల్టెన్సీల నియామక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇందు కోసం ఎంత మేర ఖర్చు చేయాల్సి ఉంటుందనేది ఒక అంచనాకు వచ్చారు.
నియామకాలు
ఈ కన్సెల్టెంట్ల నియామక ప్రక్రియకు సంబంధించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి సీఆర్డీఏ సమర్పించనుంది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే వీరి నియామక ప్రక్రియ కోసం టెండర్లను పిలవనుంది. ఇప్పటికే ఒకటి రెండు సంస్థలను ఆమోదించారు. గతంలో ఇక్కడే పనులు చేపట్టిన ఆర్వి అసోసియేట్స్, కెఎంసి ప్రాజెక్టు వంటి వాటి నియామకాలు పూర్తయ్యాయి. అదే విధంగా కావాల్సిన స్థాయిలో మిగిలిన కన్సెల్టెంట్ల నియామకాలను పూర్తి చేయాలని.. ఆ వెంటనే నిర్మాణాల టెండర్లను పిలవాలనే విధంగా సీఆర్డీఏ కసరత్తు వేగవంతం చేసింది.
-
రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్, కీలక మార్పులు..!! -
రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ -
ఎమ్మెల్యేలు కావాలనుకునే మహిళలు సిద్ధంగా ఉండండి -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్












Click it and Unblock the Notifications