కోడి పందేలు అదుర్స్, చేతులు మారిన కోట్లు
విజయవాడ: సంక్రాంతి పర్వదినం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోళ్ల పందేల జోరు చెప్పనలవి కాకుండా ఉంది. ఈ సందర్భంగా కోట్లాది రూపాయలు చేతులు మారాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పెందేల జోరు జూదరుల పాలిట స్వర్గంగా మారింది. పోలీసు ప్రకటనలు తేలిపోయి, మరోసారి పందెగాళ్లదే పైచేయి అయింది. సంప్రదాయం పేరుతో నిర్వహించే కోడిపందాలు ఈసారి మరింత జోరుగా సాగాయి.
గంటల వ్యవధిలో పందాలకు ఏర్పాట్లు చేసేసి, వేల సంఖ్యలో పందెగాళ్లను రప్పించేసి అదే సమయంలో పేకాట, గుండాట, కోతాట ఇలా రకరకాల జూదాలకు వేదికలు ఏర్పాటుచేయడంతో ఒక్కసారిగా గురువారం ఉదయానికి జిల్లా మొత్తం జూద గోదావరిగా మారిపోయింది. అడ్డూ అదుపు లేకుండా ఆడటం అంటే ఎక్కడో దూరంగా పొలాల మధ్యలో బరులు ఏర్పాటుచేసుకోవటం కాకుండా రహదారి పక్కనే, ప్రధాన సెంటర్లకు దగ్గరలోనే ఇటువంటి బరులు ఏర్పాటుచేసుకోవటం, వాటికి మించి పేకాట శిబిరాలను జోరుగా నిర్వహించడం జరిగిపోయాయి. సుఖంగా, సౌకర్యవంతంగా ఈ పందాల జాతర సాగిపోయింది.

మెట్ట, డెల్టా అన్న తేడా లేకుండా పల్లెపల్లెన ఈసారి పందాల బరులు ఏర్పడటం విశేషం. అదే జోరు శుక్రవారం రాత్రి వరకు సాగిపోయింది. ఈమధ్యలో ఎక్కడా పోలీసు ప్రస్తావనగాని, ఖాకీల జాడ గాని లేకపోవటం ఈసారి విచిత్రంగానే కన్పించింది. కత్తులు కట్టేదిలేదని, సంప్రదాయ పందాలంటూ నాయకుల నోట మాటలు విన్పించినా ఆ పరిస్దితి ఒక్క బరిలో కూడా లేదంటే ఆతిశయోక్తి కాదు. వందల కోట్ల రూపాయల్లో ఉంటుందని చెపుతున్నారు. పందాలకు మించి ఆ వేదికను ఆధారం చేసుకుని వెలిసిన పేకాట శిబిరాలు మాత్రం పూర్తి స్థాయిలో కళకళలాడిపోయాయి.
కొన్ని బరుల వద్ద కోడిపందాల దగ్గర కన్నా పేకాట శిబిరాల వద్ద అధిక సంఖ్యలో జూదగాళ్లు చేరారంటే అతిశయోక్తి కాదు. వీటితోపాటు గుండాట తదితర జూదాలు కూడా జనాన్ని పూర్తిస్థాయిలో అలరించాయి. కృష్ణాజిల్లాలో కూడా అధికారపక్ష ప్రజాప్రతినిధుల మద్దతుతో గ్రామగ్రామాన షామియానాలు వేసి రాత్రి పగలు తేడా లేకుండా కోడిపందాలు నిర్వహించారు. కనీసం కానిస్టేబుల్ కూడా అటువైపు కన్నేత్తి చూసే ధైర్యం చేయలేకపోవటంతో మరింతగా ఈ శిబిరాలు వెలిసాయి.
సంక్రాంతి రోజున ఏలూరు ఎంపి మాగంటి బాబు కైకలూరులోని తమ పంట భూముల్లో ఏర్పాటుచేసిన పందాలకు జిల్లా అంతటి నుండి ఔత్సాహికులు తరలివెళ్లారు. ఓవైపు కోడిపందాలు మరోవైపు పసందైన విందు భోజనాలు. ఇక ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే స్వయంగా కత్తికట్టిన కోళ్లను బరిలోకి దించి అభిమానులు, కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications