కానిస్టేబుల్ కుటుంబానికి ఆనంద్ చెక్ ప్రదానం
హైదరాబాద్: ఎల్లంగౌడ్ నేతృత్వంలోని నకిలీ కరెన్సీ దొంగల ముఠా కేసులో మరణించిన కానిస్టేబుల్ ఈశ్వర్ రావు కుటుంబానికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ నష్టపరిహారం కింద 5 లక్షల 24 వేల 400 రూపాయల చెక్ను అందించారు. గత నెల శామీర్పేట పరిధిలో నకిలీ కరెన్సీ ముఠా దాడిలో కానిస్టేబుల్ ఈశ్వర్ రావు మరణించిన విషయం తెలిసిందే.
ఈశ్వర రావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని సర్బుజిలి మండలం సలంతరి గ్రామం. శనివారంనాడు ఈశ్వర్ రావు తల్లిదండ్రులు మల్లేశ్వర్ రావు, తవిటమ్మ, అన్న రమణమూర్తి వచ్చి సివి ఆనంద్ను కలిశారు. సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో సంక్షేమ నిధి నుంచి రూ.5 లక్షలు, సహకార సంఘం నుంచి 19,400 రూపాయలు, ఫ్లాగ్ ఫండ్ నుంచి 5000 రూపాయలు ప్రదానం చేశారు.

ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం రూ.25 లక్షలు త్వరలో ఇప్పిస్తామని ఆనంద్ ఈశ్వర్ రావు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈశ్వర్ రావు కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, వారి కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి కోరుకున్న చోట ఉద్యోగం ఇప్పిస్తామని ఆయన చెప్పారు.
మిగతా భద్రత, ఎలిజిఎల్ఐ, పాలసీ సంబంధించిన బెనిఫిట్స్ను త్వరగా ఇప్పించాలని ఆయన పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు సిహెచ్ భద్రారెడ్డి, సభ్యులు జి. కృష్ణారెడ్డి, పి. మనోహర్ పాల్గొన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications