తెలంగాణలో పట్టుబడ్డ రెండు కోట్ల గుట్టు తేల్చిన పోలీసులు.. టీడీపీ నేతలపై కేసులు నమోదు!
హైదరాబాద్: ఊహించిందే చోటు చేసుకుంది. రెండు కోట్ల రూపాయల నల్లధనాన్ని ఏపీలోని రాజమండ్రికి తరలిస్తున్న కేసులో సైబరాబాద్ పోలీసులు చురుగ్గా వ్యవహరించారు. ఈ ఘటనలో రాజమండ్రికి చెందిన తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ లోక్ సభ సభ్యుడు, జయభేరి గ్రూపు సంస్థల ఛైర్మన్ మాగంటి మురళీ మోహన్ పై కేసు నమోదు చేశారు. భారత శిక్ష్యాస్మృతిలోని 171బీ, 171ఈ, సీ, ఎఫ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ తెలిపారు. మురళీమోహన్ తో పాటు రెండు కోట్ల రూపాయలను తరలిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన నిమ్మలూరి శ్రీహరి, పండరి, ధర్మరాజు, జగన్మోహన రావులపైనా కేసు పెట్టినట్లు ఆయన వెల్లడించారు.

నేరాన్ని అంగీకరించారు..
సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం పరిధిలోని హైటెక్ సిటీ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా.. జయభేరి కన్ స్ట్రక్షన్స్ ఉద్యోగులు శ్రీహరి, పండరి రెండు కోట్ల రూపాయలను తరలిస్తూ దొరికిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసుల విచారణలో వారు తమ నేరాన్ని అంగీకరించారు. జయభేరి గ్రూపు సంస్థల ఛైర్మన్ మురళీ మోహన్ కు ఈ మొత్తాన్ని అందజేయడానికి రాజమండ్రికి వెళ్తున్నట్లు వెల్లడించారని సజ్జన్నార్ స్పష్టం చేశారు. రైలు ద్వారా రెండు కోట్ల రూపాయలను రాజమండ్రికి తరలించడానికి సిద్ధపడినట్లు వెల్లడైందని అన్నారు.

ఆ డబ్బు జయభేరి సంస్థదే..
రెండు కోట్ల రూపాయల మొత్తం జయభేరీ సంస్థకు చెందినవేనని నిర్ధారించినట్లు సజ్జన్నార్ తెలిపారు. జయభేరి కనస్ట్రక్షన్స్ సంస్థకు చెందిన ఉద్యోగులు ధర్మరాజు, జగన్మోహన్ రావు తమకు ఈ మొత్తాన్ని నిందితులు శ్రీహరి, పండరిలకు ఇచ్చారని ఈ డబ్బులు ఇచ్చారని, రైలులో వారు రాజమండ్రికి తీసుకుని వెళ్లాల్సి ఉందని అన్నారు. ఈ నగదును రైలులో రాజమండ్రికి తీసుకెళ్లాలని ధర్మరాజు, జగన్మోహన్ రావు ఇచ్చిన ఆదేశాలతో శ్రీహరి, పండరిలు డబ్బుతో కూడిన బ్యాగులతో బయలు దేరినట్లు తేలిందని స్పష్టం చేశారు.

ఆరుమందిపై కేసు..
సికింద్రాబాద్ నుంచి రైలు ద్వారా రాజమండ్రికి వెళ్లి.. అక్కడ యలమంచిలి మురళీకృష్ణ అనే వ్యక్తికి ఈ బ్యాగును అందజేయాల్సి ఉందని తమ విచారణలో తేలినట్లు సజ్జన్నార్ తెలిపారు. రాజమండ్రి రైల్వేస్టేషన్ వద్ద మురళీకృష్ణ అనే వ్యక్తి నిందితుల కోసం ఎదురు చూస్తుంటారని, ఆయన చేతికి ఈ బ్యాగును అందజేయాలని ధర్మారాజు, జగన్మోహన్ రావులు తమకు సూచించినట్లు నిందితులు తెలిపారని అన్నారు. ఈ ఘటనలో డబ్బులతో కూడిన బ్యాగును తీసుకెళ్తున్న శ్రీహరి, పండరిలతో పాటు బ్యాగును ఇచ్చిన ధర్మరాజు, జగన్మోహన్ రావు, యలమంచిలి మురళీకృష్ణ, జయభేరి సంస్థ ఛైర్మన్ మురళీ మోహన్ లపై కేసు నమోదు చేశామని అన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications