వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఢిల్లీ మోడల్
పోలీసులు దాడి చేసి ఢిల్లీకి చెందిన మోడల్ను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు రామకృష్ణంరాజు, రాజేష్, సత్యనారాయణను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోడల్ వయస్సు 24. ఆమెను రెస్క్యూ హోంకు తరలించారు.
అప్పుల బాధతో మహిళా రియల్టర్ ఆత్మహత్య
ప్లాట్లు అమ్ముడుపోక, చేసిన అప్పులు తీర్చలేక, ఓ మహిళా రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉరివేసుకొంది. దిల్సుఖ్నగర్లోని శేషగిరిప్రభు, వీణ (42) దంపతులు నివాసముంటున్నారు. వీణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. ఎస్ఎస్ డెవలపర్స్ పేరిట అల్కాపురి కాలనీలో కార్యాలయం ఏర్పాటు చేసింది.
ఆరు నెలల క్రితం అరుణ్, గణేష్ అనే వ్యక్తులతో కలిసి కొత్తగూడెం- పోచంపల్లి మార్గంలో ఐదెకరాల స్థలం కొనుగోలు చేసి వెంచర్ వేసింది. తాను ఉంటున్న భవనానికి సంబంధించిన డాక్యుమెంట్లు బ్యాంకులో తాకట్టుపెట్టి వచ్చిన నగదును వెంచర్లో పెట్టుబడిగా పెట్టింది.
ప్లాట్లు అమ్ముడుపోకపోవటంతో నెల నెలా వడ్డీ చెల్లించటానికి ఇబ్బందులు పడసాగింది. ఈ క్రమంలో ఆర్థికభారంతో కుంగిపోయిన వీణ బుధవారం తన కార్యాలయానికి వెళ్లి లోపల గడియపెట్టుకొని చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకుంది. ఫోన్ చేసినా ఎంతకూ తీయకపోవటంతో అనుమానమొచ్చిన శేషగిరి కార్యాలయానికి వెళ్లాడు. తలుపు పగులగొట్టి
లోపలికి వెళ్లి చూడగా వీణ ఫ్యాన్కు వేలాడుతూ కన్పించింది. ఆమెను కిందికి దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.