కన్నీళ్లు పెట్టుకున్న పవన్, లోకేశ్.. వీడియో వైరల్
వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు రాష్ట్ర మంత్రులు తరలి వచ్చారు. ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, అనిత, సత్యప్రసాద్.. మురళీ నాయక్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. పవన్ కల్యాణ్ ను చూడగానే మురళీ నాయక్ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆయన చెంత చేరింది. తీవ్ర భావోద్వేగంతో ఉన్న ఆ కుటుంబాన్ని పవన్ ఓదార్చారు. వాళ్లకు ధైర్య చెప్పారు. ఈ క్రమంలో పవన్ కూడా కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడి వారిని కలిచివేసింది.
మురళీ నాయక్ కుటుంబానికి 5 ఎకరాల భూమి, రూ. 50 లక్షల సాయం, 300 గజాల స్థలం, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అంతేకాక వ్యక్తిగతంగా జవాన్ కుటుంబానికి రూ. 25 లక్షలు సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు వీర జవాన్ మురళీ నాయక్ భౌతిక కాయానికి మంత్రి లోకేశ్ నివాళులు అర్పించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. మంత్రి లోకేశ్ సైతం ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతూ మురళీ నాయక్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. నేడు అధికార లాంఛనాలతో మురళీ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
వీరజవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని ఓదారుస్తున్న పవన్.!#NaraLokesh #Pawankalyan #OperationSindoor #MuraliNaik #MuraliNayak #Jawan #IndiaPakistanWar #OIUpdates #OITelugu pic.twitter.com/TDTcbMU86G
— oneindiatelugu (@oneindiatelugu) May 11, 2025
ఇక మురళీ నాయక్ భౌతిక కాయం తరలించే సమయంలో రాష్ట్ర మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. జవాన్ కు నివాళిగా జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి కూడలిలో వేల సంఖ్యలో ప్రజలు చేరుకుని పూలతో వీడ్కోలు పలికారు. మంత్రి సవిత పర్యవేక్షణలో ప్రజలు భారీ కాన్వాయ్గా ఏర్పడి, జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహిస్తూ భౌతికకాయాన్ని తరలించారు. దీంతో బెంగళూరు నుంచి కళ్లితండాకు 90 నిమిషాల ప్రయాణం 8 గంటలు పట్టింది.
వీరజవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని ఓదారుస్తున్న పవన్.!#NaraLokesh #Pawankalyan #OperationSindoor #MuraliNaik #MuraliNayak #Jawan #IndiaPakistanWar #OIUpdates #OITelugu pic.twitter.com/TDTcbMU86G
— oneindiatelugu (@oneindiatelugu) May 11, 2025
మరోవైపు మురళీ నాయక్ భౌతికకాయానికి వైసీపీ నేతలు ఉషశ్రీ చరణ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈనెల 13న వైఎస్ జగన్ కళ్లి తండాకు వచ్చి మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శిస్తారని చెప్పారు.
-
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications