Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో సోషల్ మీడియాపై ఉక్కుపాదం: అసెంబ్లీలో కొత్త బిల్లు?

Pawan Kalyan: రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది.. సోషల్ మీడియా. రాజకీయ వాతావరణం మొత్తం కొద్ది రోజులుగా దీని చుట్టే తిరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు, వాళ్లకు 41 ఏ కింద నోటీసులు ఇవ్వడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి.

తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుకు నిరసనగా అటు వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం ఎదురుదాడి చేస్తోంది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా బరిలో దిగారు. అరెస్టులపై ఘాటుగా స్పందించారు. వారికి అండగా ఉంటానంటూ ప్రకటించారు.

Deputy CM Pawan Kalyan proposed the Social Media Abuse Protection Bill

ఈ క్రమంలో పార్టీ తరపున ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌‌ను సైతం వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసింది. అక్రమ నిర్భంధాలకు గురవుతున్న సోషల్‌ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు, వారికి భరోసా ఇవ్వడం, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం ఈ టాస్క్‌ఫోర్స్‌ పని చేస్తుంది.

ఈ పరిస్థితుల మధ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓ ప్రతిపాదనను తెర మీదికి తీసుకొచ్చారు. సోషల్ మీడియా దూకుడుకు బ్రేకులు వసేలా కొత్తగా ఓ చట్టాన్ని తీసుకుని రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టాలని సూచించారు.

సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్లును సభలో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. హోమ్ మంత్రిని సైతం వదలట్లేదని, మహిళ అని కూడా చూడకుండా ఆమెను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు వేస్తోన్నారని, శాడిస్టులుగా వ్యవహరిస్తోన్నారని పవన్ విమర్శించారు.

Deputy CM Pawan Kalyan proposed the Social Media Abuse Protection Bill

సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్ పూర్తిగా దుర్వినియోగమౌతోందని, ప్రమాదకర స్థాయికి చేరుకుందని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు, ప్రజలను భయపెట్టడానికి వాటిని ఉపయోగిస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో ఎంపీగా పనిచేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పట్ల వ్యవహరించిన తీరును పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.

ఎంపీగా పనిచేసిన రఘురామ కృష్ణంరాజు వంటి నాయకుడికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని పవన్ అన్నారు. ఈ సైబర్ బెదిరింపు ధోరణి ప్రజాస్వామ్యానికి హానికరమని, దీన్ని అడ్డుకోవడానికి సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+