రక్తసిక్తమైన దేవరగట్టు 'బన్ని ఉత్సవం': ఐదుగురి పరిస్థితి విషమం
అమరావతి: కర్నూలు జిల్లా దేవరగట్టు గ్రామంలో జరిగే 'బన్ని ఉత్సవం'లో ఈసారి ఎలాగైనా రక్తపాతాన్ని ఆపాలనుకున్న ఆ జిల్లా ఎస్పీ రవికృష్ణ ఆశయం నెరవేరలేదు. ప్రతి ఏటా దసరా రోజున జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా జరిగిన కర్రల సమరం రక్తసిక్తంగా మారింది.
ప్రతి ఏటా దసరా రోజున కర్రలు చేతబట్టి దేవర విగ్రహాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లేందుకు పలు గ్రామాలకు చెందిన యువత మధ్య పోరాటం చోటుచేసుకోవడం అక్కడ ఆనవాయతీ. ఈ పోరులో వాడే కర్రల చివర ఇనుప కమ్మీలు తొడగడం, మద్యం సేవించి ఉత్సవంలో పాలుపంచుకోవడం తదితర కారణాలతో ఏటా రక్తం చిందుతోంది.

ఈ ఏడాది రక్తపాతాన్ని నివారించాలని జిల్లా ఎస్పీ రవికృష్ణ విశ్వయత్నం చేశారు. కర్రల చివర ఇనుప కమ్మీలు లేకుండా చూడటంతో పాటు మద్యం సేవించిన వారిని పోరుకు దూరంగా ఉంచాలని ఆయన గ్రామస్థులకు సూచించారు. అంతేకాక దాదాపు వెయ్యి మందికి పైగా పోలీసులను రంగంలోకి దించారు.
అయినా సరే గురువారం జరిగిన బన్ని ఉత్సవంలో గ్రామాలకు చెందిన వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. మద్యం మత్తులో యువత రెచ్చిపోయింది. గురువారం జరిగిన కర్రల సమరంలో 30 మందికిపైగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించింది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం కర్నూలు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications