వారికి మింగుడు పడకపోతే చంద్రబాబే...: దేవినేని నెహ్రూ వ్యాఖ్యలు
విజయవాడ: తాను తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు కొంత మంది శాసనసభ్యులు హాజరు కాకపోవడంపై మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వారు హాజరు కాకపోవడంపై తనకేమీ సంబంధం లేదని అన్నారు.
తాను టిడిపిలో చేరడం వారికి మింగుడు పడకపోతే వాళ్ల గొంతుల్లో నీళ్లు పోసి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే మింగుడు పడేలా చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. తనను నమ్ముకుని చాలా మంది పార్టీలోకి వచ్చారని, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు.

చంద్రబాబు నాయుడు తనకు ఏ బాధ్యత అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తానని ఆయన సోమవారం మీడియాతో అన్నారు. దేవినేని నెహ్రూతో పాటు ఆయనయ కుమారుడు దేవినేని అవినాష్ ఇటీవల చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిన విషయం తెలిసిందే.
నెహ్రూ టిడిపిలో చేరడానికి ఏర్పాటైన సభకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశి, మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు, మరికొంత మంది హాజరు కాలేదని వార్తలు వచ్చాయి. దేవినేని నెహ్రూను పార్టీలో చేర్చుకోవడం ఇష్టం లేకనే వారు సభకు హాజరు కాలేదనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications