సాక్షిలో తప్పుడు ప్రచారం!.. పోలవరం పూర్తి చేసి తీరుతాం: జగన్పై దేవినేని
సాక్షిలో ఎన్ని తప్పుడు వార్తలు రాసినా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి తీరుతామని దేవినేని అన్నారు.
విజయవాడ: పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఎంత విషం చిమ్మినా చరిత్ర హీనుడు గానే మిగిలిపోతారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం పూర్తయితే వైసీపీకి పుట్టగతులు ఉండవని మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టుపై మంగళవారం నాడు దేవినేని మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కింద భూమి కోల్పోతున్న నిర్వాసితులకు భూమికి భూమి ఇస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1981 కోట్లు చెక్కు రూపంలో అందిందన్నారు.

2018 చివరికల్లా పోలవరం ప్రాజెక్టును ఎలాగైన పూర్తి చేయాలన్న సంకల్పంతో తామున్నామని, సాక్షి పత్రికలో దీనిపై ఇష్టం వచ్చినట్టు రాసి విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. పోలవరాన్ని అడ్డుకోవడం కోసం జగన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. గతంలో వట్టిసీమపై కుట్రలు చేసిన వైసీపీ పక్క రాష్ట్రాల వాళ్లను కూడా రెచ్చగొట్టిందని అన్నారు.
సాక్షిలో ఎన్ని తప్పుడు వార్తలు రాసినా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి తీరుతామని దేవినేని అన్నారు. జగన్ ఏమి మాట్లాడిన ప్రజలు నమ్ముతారనే భ్రమలో అసత్యాల్ని ప్రచారం చేస్తున్నారని ఈ సందర్బంగా దేవినేని ఆరోపించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications