ధర్నా: ఇక్కడ చింతమనేని, అక్కడ వెంకటరమణ
బుధవారంనాడు పోలింగ్ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావుపై దాడి కేసులో కొందరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. టిడిపి కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ చింతమనేని ధర్నాకు దిగారు.
ఇదిలావుంటే, తిరుపతి నగరంలోని పూలే విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి వెంకటరమణ గురువారం ఉదయం మౌనదీక్షకు దిగారు. తనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కరుణాకర్రెడ్డి దాడి చేశారని నిరసనగా వెంకటరమణ మౌనదీక్ష చేపట్టారు.
ఎన్నికల సందర్భంగా బుధవారం సాయంత్రం వెంకటరమణపై భూమన కరుణాకర్ రెడ్డి దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గొడవ నేపథ్యంలో ఇరువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని రెండు గంటల తర్వాత వదిలేశారు. గురువారం ఉదయం తన అనుచరులతో దీక్ష చేసిన వెంకటరమణ ఆ తర్వాత ఎన్టీఆర్ విగ్రహం వరకు పాదయాత్ర చేశారు