వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రమంత్రి వర్సెస్ చైర్మన్: చొక్కాలు పట్టుకున్న నేతలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Differences in Warangal Congress
వరంగల్: ఓరుగల్లులో కాంగ్రెసు పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెసు నేతలు చొక్కాలు పట్టుకునే వరకు వెళ్లారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని విభజనపై వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంత కాంగ్రెసు నాయకులు జిల్లాల్లో కృతజ్ఞత సభలు నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా నవంబర్ ఆరో తేదిన వరంగల్‌లో నిర్వహించనున్నారు. దీనిపై చర్చించేందుకు జిల్లా పార్టీ నాయకులు ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్రమంత్రి బలరాం నాయక్, డిసిసిబి చైర్మన్ జంగా రాఘవ రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది.

అది చినికి చినికి వానలా మారింది. ఓ సమయంలో రాఘవ రెడ్డి కేంద్రమంత్రి చొక్కా పట్టుకొని నెట్టేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో సమావేశాన్ని పొన్నాల లక్ష్మయ్య మధ్యలోనే ముగించారు.

కాగా, తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల చిరకాల వాంఛను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నెరవేర్చినందున గద్వాలలో మంగళవారం కృతజ్ఞత సభను ఏర్పాటు చేసినట్లు మంత్రి డికె అరుణ చెప్పారు.

English summary
The differences revealed in Warnagal district Congress Party on Tuesday in a meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X