కాపులూ జాగ్రత్త! పురంధేశ్వరివి ఏం మాటలు: బిజెపి నేతలపై డొక్కా
గుంటూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన విమర్శలు గుప్పిస్తున్న భారతీయ జనతా పార్టీ నేతలకు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ గురువారం నాడు కౌంటర్ ఇచ్చారు. మిత్ర ధర్మానికి విరుద్ధంగా బిజెపి నేతలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
బిజెపి నేతలు చంద్రబాబును విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర అభివృద్ధికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలన్నారు. రాజకీయంగా ఉనికి లేనప్పుడే కాపుల గురించి మాట్లాడే నేతల పట్ల కాపులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి రాజకీయ నేతలా కాకుండా కాగ్ ప్రతినిధిగా మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రాయలసీమ విషయంలో మరోసారి తప్పటడుగులు వేయవద్దని వైయస్సార్ కాంగ్రెస్, బిజెపిలకు డొక్కా విజ్ఞప్తి చేశారు.

కాగా, ఇటీవల బిజెపి నేతలు ఏపీ ప్రభుత్వంపై, చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి హరిరామ జోగయ్య రాసిన వివాదాస్పద పుస్తకావిష్కరణలో పురంధేశ్వరి పాల్గొన్నారు.
జోగయ్య పుస్తకంలోని వివాదాస్పద అంశాలపై చంద్రబాబు వివరణ ఇవ్వాలని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఏపీలో టిడిపికి ఆదరణ తగ్గుతోందని కావూరి సాంబశివ రావు అన్నారు. ఈ నేపథ్యంలో డొక్కా బిజెపి నేతల పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications