మద్యం మత్తులో బైక్ను ఢీకొట్టిన ఏఆర్ కానిస్టేబుల్: టెక్కీ తేజస్విని బ్రెయిన్ డెడ్
విజయవాడ: మద్యం మత్తులో ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు నిర్లక్ష్యంగా మోటార్ బైక్ నడిపి మరో బైక్ను ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఏఆర్ కానిస్టేబుల్ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ ఘటనపై విజయవాడ సీపీ గౌతం సవాంగ్ సీరియస్ అయ్యారు.
చెన్నైలో తేజస్విని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. తన స్వగ్రామమైన విజయవాడకు వచ్చింది. సోదరుడితో కలిసి బుధవారం నాడు ఆమె బైక్పై వెళ్తోంది. అయితే అదే సమయంలో ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు నిర్లక్ష్యంగా మోటార్ బైక్ నడిపి ఢీకొట్టాడు. దీంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ తేజస్విని ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు.

తేజస్విని బ్రెయిన్ డెడ్కు గురైందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై విజయవాడ సీపీ గౌతం సవాంగ్ సీరియస్ అయ్యాడు. ఏఆర్ కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీపీ ఆదేశాల మేరకు పోలీసులు ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకొన్నారు.
గతంలో కూడ ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు సస్పెన్షన్కు గురయ్యారని స్థానికులు చెప్పారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications