ఏపీలో ఎన్నికల షెడ్యూల్ పై ఢిల్లీ కీలక అప్డేట్..!!

ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల తేదీల పైన స్పష్టత వస్తోంది. ఎన్నికల సంఘం ఇప్పటికే ఏపీలో ఎన్నికల నిర్వహణ పైన అధికార యంత్రాంగాన్ని సిద్దం చేస్తోంది. 16 వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు 2024 లో జరుగనున్నాయి. 2019 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల తరువాత ఏర్పడిన 15 వ సభ కాలం, 2024 జూన్ 11 న ముగియనుంది. సభ లోని 175 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. దీనికి సంబంధించి కీలక అప్డేడ్ అందుతోంది.

ఎన్నికల సమరం: ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. ఇప్పటికే వైసీపీ సిద్దం సభలతో కేడర్ ను ఎన్నికల యుద్దానికి సిద్దం చేస్తోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్నికల సమరశంఖం పూరించారు. షెడ్యూల్, పోలింగ్ తేదీల పైన పార్టీలు అంచనాకు వచ్చాయి. దీంతో, అధినేతలు అలర్ట్ అవుతున్నారు. ఏపీలో తొలి విడతలోనే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

Election commission likely to Schedule announce on 14th March for Poll in AP

ఎన్నికల నిర్వహణ పై కేంద్ర ఎన్నికల సంఘం బిజీగా ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తున్నారు. ఆయా చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులను అంచనా వేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో అధికారుల పర్యటన మార్చి 13వ తేదీ లోపు ముగియనుంది. 13, 14 తేదీల్లో లోక్ సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.

ఏపీలో షెడ్యూల్: 2019 లో మార్చి 10న ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 18న నోటిఫికేషన్ జారీ అయింది. ఏప్రిల్ 11న పోలింగ్ జరగ్గా, మే 23న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సారి మార్చి 13 తరువాత షెడ్యూల్ విడుదల అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ లెక్కన ఏప్రిల్ 15 -20 మధ్య పోలింగ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఏపీలో తొలి విడతలోనే 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. గతంలోనూ తొలి విడతలోనే ఏపీలో ఎన్నికలు నిర్వహించటం ద్వారా..ఇతర రాష్ట్రాలకు అధికారులు, భద్రతా సిబ్బందిని వినియోగంచుకోవటానికి ఎన్నికల సంఘానికి వెసులుబాటు ఉంటుంది. తొలి విడతలో ఏపీతో పాటుగా తెలంగాణలోనూ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం.

సిద్దమవుతున్న పార్టీలు: ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు..అందుతున్న సంకేతాలతో ఏపీలో ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. అందులో భాగంగా టీడీపీ, జనసేన తమ అభ్యర్దుల తొలి జాబితా ఇప్పటికే విడుదలయ్యాయి. బీజేపీతో పొత్తు కారణంగా అన్ని సీట్లు ప్రకటించకుండా, ఖాయమైన సీట్లను ప్రకటించాలని నిర్ణయించారు.

బీజేపీ కేటాయించే సీట్ల పైన చంద్రబాబు - పవన్ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే వారం ఈ ఇద్దరు నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం తరువాత సీట్లు..ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనకు నిర్ణయించారు. దీంతో..ఇక ఏపీలో ఎన్నికల ముహూర్తం పైన దాదాపు క్లారిటీ రావటంతో..ప్రజల మధ్యనే ఉండాలని ముఖ్య నేతలు నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+