కెసిఆర్ ఎవరు: మీడియా బ్యాన్పై ఎర్రబెల్లి ఫైర్
హైదరాబాద్: తెలంగాణలో మీడియాను తొక్కేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఎవరని తెలంగాణ తెలుగుదేశం నేత ఎర్రబెల్లి దయాకర్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేసి నిజాం నిరంకుశ పాలనను తలపిస్తున్నారని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు.
కెసిఆర్ తన వైఖరి మార్చుకోకపోతే అంతు చూస్తామని హెచ్చరించారు. వందరోజుల పాలనలో కేసీఆర్ వెయ్యి అబద్దాలు ఆడారని విమర్శించారు. మెదక్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. పోలీసులు, అధికారులను గుప్పిట్లో పెట్టుకున్నారన్నారు.

వంద రోజుల్లో తాను ఏ పనీ చేయలేదంటున్న కేసీఆర్కు ఎందుకు ఓటేయాలని ఆయన ప్రశ్నించారు. ఓట్ల కోసమే సంగారెడ్డి, సిద్ధిపేటను జిల్లాలుగా మారుస్తామని ప్రకటన చేశారని ఎర్రబెల్లి అన్నారు.గోల్కొండపై జెండా ఎగురవేసిన నాటి నుంచి కేసీఆర్లో నిజాం నిరంకుశత్వం ప్రవేశించిందని ఆయన దుయ్యబట్టారు.
సర్పంచ్లను తొలగించే అధికారం కెసిఆర్ ఎవరిచ్చారని ఎర్రబెల్లి నిలదీశారు. దమ్ముంటే బడ్జెట్ సమావేశాలు పెట్టాలన్నారు. తెలంగాణ ఇచ్చి అధికారం తెచ్చుకోలేని పార్టీ కాంగ్రెస్ అని, మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్తో కాంగ్రెస్ కుమ్మక్కయిందని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications