బాలినేని పిటీషన్ వాయిదా.. ఆగిన ఒంగోలు ఈవీఎం రీవెరిఫికేషన్!
ఒంగోలు నియోజకవర్గంలో నేటి నుండి ఆరు రోజుల పాటు రీ పోలింగ్ జరగాల్సి ఉంది. మళ్ళీ వివిధ పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. నిజమే ఒంగోలు లో ఓటర్లు నేడు మళ్ళీ ఓట్లు వేసేందుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ బాలినేని తాజా డిమాండ్ తో మళ్ళీ ఈవీఎం ల రీ వెరిఫికేషన్ ప్రక్రియ ఆగిపోయింది.
ఈవీఎంల రీ వెరిఫికేషన్ లో అనూహ్య పరిణామాలు
వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థనతో ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు నేటి నుండి ఆరు రోజుల పాటు 12 పోలింగ్ బూత్ లలో ఓట్లు వేయించి , ఆ ఓటు ఎవరికి వేశారు, ఎవరికి నమోదైంది అనేది బహిరంగంగానే చెక్ చెయ్యనున్నారు. ఇందులో భాగంగా ప్రజలు తమ ఓటు హక్కు మళ్ళీ వినియోగించుకోవాల్సి ఉండగా నేడు ప్రక్రియ ప్రారంభించిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

బాలినేని తరపు ప్రతినిధులు వాకౌట్
నేడు కలెక్టర్ తమీమ్ అన్సారియా, ప్రత్యేక అధికారి ఝూన్సీలక్ష్మి, భెల్ సిబ్బంది ఈవీఎంల రీ చెకింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. అయితే ఈవీఎం లతో పాటు వీవీ ప్యాట్ లను కూడా కౌంట్ చెయ్యాలని బాలినేని తరపు ప్రతినిధులు అధికారులను కోరారు. దీనికి వారు కుదరదని చెప్పగా బాలినేని ప్రతినిధులు పోలింగ్ కేంద్రం వాకౌట్ చేశారు.
హైకోర్టును ఆశ్రయించిన బాలినేని
దీంతో ఈవీఎంల రీ వెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. అంతకు ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి ఈవీఎంల రీ చెకింగ్ పై హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. ఈవీఎంలను మాక్ పోలింగ్ పద్ధతిలో కాకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈవీఎంలతో పాటు, వీవీప్యాట్ లు కూడా లెక్కించాలని మాజీ మంత్రి బాలినేని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బాలినేని రిట్ పిటీషన్ రేపటికి వాయిదా
ఈ పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. బాలినేని తరపు అడ్వకేట్లు కోర్టులో ఎన్నికల కమీషన్ మాక్ పోలింగ్ విధానంలో ఈవీఎంల రీ వెరిఫికేషన్ చెయ్యాలని పేర్కొందని, అయితే అది సరికాదని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు. ఎన్నికల కమీషన్ తరపు న్యాయవాదులను కౌంటర్ కోరగా రేపు తమ వాదనలు వినిపిస్తామని వారు చెప్పారు. దీంతో కోర్టు ఈ పిటీషన్ పై విచారణని రేపటికి వాయిదా వేసింది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications