వైసీపీ నుంచి ఆఫర్ వచ్చింది- హామీ ఇస్తే చేరతా : మాజీ జేడీ లక్ష్మీనారాయణ..!!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక అంశాలను వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తాను విశాఖ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు. పార్టీ పైన మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సమయంలో తనకు వస్తున్న ఆఫర్ల గురించి వివరించారు. తాను ఐపీఎస్ కు రాజీనామా చేయటం వెనుక కారణాన్ని చెప్పుకొచ్చారు. తనకు విశాఖ ప్రజల ఆదరణ ఉందని ధీమా వ్యక్తం చేసారు. లక్ష్మీనారాయణ తాజాగా చెప్పుకొచ్చిన అంశాలు రాజీకయంగా ఆసక్త కరంగా మారాయి.

తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ పలు అంశాలను ప్రస్తావించారు. తనకు బీఆర్ఎస్ ..వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ తమ పార్టీల్లో చేరాలని కోరుతున్నారని వివరించారు. తాను వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేసిన లక్ష్మీనారాయణ 2019 ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించారు. తాను ఆ ఎన్నికల్లో గెలిచినట్లుగానే భావిస్తున్నట్లు చెప్పారు. తనకు 2,88,754 ఓట్లు రావటం ద్వారా అక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేది గుర్తించాలన్నారు. ఇప్పటికీ తాను విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా పోరాటం చేస్తున్నానని వివరించారు. రాత్రికి రాత్రి ఒక అధికారితో రాజీనామా చేయించి ఎన్నికల కమిషనర్ ను చేయటం సరి కాదని అభిప్రాయపడ్డారు.

EX JD Lakshmi Narayana reveals that he got offer from BRS and YSRCP, says want to contest from Vizag

తనకు బీఆర్ఎస్ నుంచి ఆఫర్ వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా నియమితులైన తోట చంద్రశేఖర్..తాను ఒకే కేడర్ అని గుర్తు చేసారు. ఇద్దరు కలిసి మహారాష్ట్రలో పని చేసామన్నారు. తాము ఇద్దరం కూడా జనసేనలో ఉన్నామని చెప్పారు. ఇప్పుడు ఆయనకు ఏపీలో బీఆర్ఎస్ బాధ్యతలు అప్పగించటంతో తనను కూడా రావాలని అడిగారాని..తాను ఆలోచన చేస్తున్నానని వెల్లడించారు. తనను వైసీపీ నేతలు కూడా అప్పుడప్పుడు కలుస్తుంటారని చెప్పుకొచ్చారు. పార్టీలోకి రండి అంటు అడుగుతూ ఉంటారని చెప్పారు. 2019 ఎన్నికల సమయంలోనూ తననున వైసీపీలోకి రమ్మన్నారని లక్ష్మీ నారాయణ వెల్లడించారు. అయితే, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిపై చర్చకు హామీ ఇచ్చి తాను పార్టీల్లో చేరటానికి సిద్దమని స్పష్టం చేసారు.

EX JD Lakshmi Narayana reveals that he got offer from BRS and YSRCP, says want to contest from Vizag

విశాఖ నుంచి తిరిగి తాను పోటీ చేయటం ఖాయమని లక్ష్మీనారాయణ స్పష్టం చేసారు. తాను కోరుకొనే అంశాల పైన పార్టీలు చర్చకు సిద్దమైతే వారితో కలుస్తానని..లేకుంటే తాను స్వతంత్రంగానే బరిలోకి దిగేందుకు సిద్దమని తేల్చి చెప్పారు. తాను వీఆర్ఎస్ తీసుకోవటానికి ముందు హైదరాబాద్‌లో ఎన్‌ఐఆర్‌డీ సంస్థలో డిప్యూటీ డైరెక్టర్‌జ నరల్‌ పదవికి దరఖాస్తు చేసినట్లు చెప్పారు. అది వచ్చి ఉంటే రాజకీయాలవైపు వచ్చి ఉండేవాడిని కాదని వివరించారు. ప్రత్యేక హోదా ముగిసిపోలేదన్నారు. కేంద్రం అనుకుంటే ప్రత్యేక హోదా ఇవ్వొచ్చని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నిక పెట్టాల్సి వస్తే.. అక్కడ అప్పటికే సెకండ్‌ వచ్చినవారిని మిగిలిన కాలానికి ఎమ్మెల్యేను చేయాలని..ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలని లక్ష్మీనారాయణ అభిప్రాయ పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+