Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏం రామ్మోహన్-ఇవన్నీ చూసుకోవాలిగా..! పవార్ ఘటన వేళ సాయిరెడ్డి..!

నిన్న మహారాష్ట్రలోని బారామతి ఎయిర్ పోర్టులో విమానం కుప్పకూలిన ఘటనలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో పాటు మరో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ నేపథ్యంలో దేశంలో విమానాల భద్రత మరోసారి చర్చనీయాంశమైంది. గతేడాది అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మర్చిపోకముందే బారామతి విమాన ప్రమాదం జరగడంతో ప్రయాణికులు విమానాలు ఎక్కాలంటే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో విమానయానమంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు పాత్రపైనా విమర్శలు వస్తున్నాయి.

అజిత్ పవార్ విమాన ఘటన తర్వాత పౌర విమానయానశాఖ ఇప్పటివరకూ భవిష్యత్తులో విమానాల భద్రతపై ఎలాంటి చర్యలూ ప్రకటించలేదు. దీంతో దేశంలో 2047 నాటికి 400 ఎయిర్ పోర్టులు కడతామంటూ టార్గెట్లు పెడుతున్న విమానయానమంత్రి రామ్మోహన్ నాయుడిని లక్ష్యంగా చేసుకుని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) ఇవాళ ఓ ట్వీట్ చేశారు. దేశంలో విమానాల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో భద్రతను కూడా చూసుకోవాలిగా అనే అర్దం వచ్చేలా సాయిరెడ్డి ఇవాళ ఈ ట్వీట్ చేశారు.

Vijayasai Reddy Urges Ram mohan Naidu Fix India s Air Safety Now for the 400-Airport Era

భారతదేశ దేశీయ విమాన ట్రాఫిక్ ఏటా 10-12% పెరుగుతోందని, 2047 నాటికి మనం 400 విమానాశ్రయాల దిశగా వెళుతున్నందున, ఎయిర్-ట్రాఫిక్ భద్రత వేగాన్ని కొనసాగించాలని విజయసాయిరెడ్డి సూచించారు. డీజీసీఏని ఆధునీకరించాలని, ఏటీసీ సిబ్బంది/సాంకేతికతను బలోపేతం చేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని కోరారు. అలాగే నిర్వహణ లోపాలు వంటి ప్రమాదాలను తగ్గించాలని కూడా కోరారు. ఇటీవలి సంఘటనల తర్వాత ప్రయాణీకుల నమ్మకం సన్నగిల్లుతోందని ఆయన మంత్రి దృష్టికి తెచ్చారు. కాబట్టి ఈ వ్యవహారంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+