వేణుగోపాలస్వామి ఆలయంలో అగ్ని ప్రమాదం: ఎగిసిన మంటలు, భక్తుల పరుగులు
పశ్చిమగోదావరి: జిల్లాలోని తణుకు మండలం దువ్వలో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. స్థానిక వేణుగోపాలస్వామి ఆలయంలో రాములవారి కళ్యాణోత్సవం నిర్వహించారు. అయితే, షాట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఏర్పాటు చేసిన చలువ పందిరిలో మంటలు చెలరేగాయి.
పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ క్రమంలో భయాందోళనలకు గురైన భక్తులు ఆలయం బయటికి పరుగులు తీశారు. దీంతో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. భక్తులతో కలిసి స్థానికులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ఇది ఇలావుండగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లోనూ అపశృతి చోటు చేసుకుంది. ఇండోర్లోని ఓ ఆలయంలో మెట్లబావి పైకప్పు కూలడంతో అందులో 30 మంది వరకు భక్తులు పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అధికారులు బావిలో పడివారిని బయటికి తీశారు. వీరిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
ప.గో జిల్లా: తణుకు మండలం దువ్వలో అగ్ని ప్రమాదం.వేణు గోపాలస్వామి ఆలయంలో పందిరిషార్ట్ సర్క్యూట్ తో దగ్ధం. pic.twitter.com/soaCNnXZYM
— oneindiatelugu (@oneindiatelugu) March 30, 2023
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇండోర్ పటేల్నగర్ ప్రాంతంలోని మహదేవ్ జులేలాల్ ఆలయంలో రామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యాయి. స్థలాభావం కారణంగా కొందరు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావి పైకప్పుపై కూర్చున్నారు. అయితే, కొంతసేపటి తర్వాత ఆ బావి పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో దాదాపు 25 మందికిపైగా భక్తులు అందులో పడిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
నిచ్చెన సాయంతో భక్తులను బయటకు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటి వరకు 10 మందిని బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. బావి లోతు 50 అడుగులపైనే ఉన్నట్లు తెలుస్తోంది. బావిలో పడిన మిగితా భక్తులను కూడా బయటికి తీసేందుకు పోలీసులు, అధికారులు శ్రమిస్తున్నారు. కొందరికి తీవ్రగాయాలైనట్లు తెలిసింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications